Home » Politics
గత ఐదేండ్ల గణంకాలను పరిశీలిస్తే తెలంగాణ నుంచి ఎంపికవుతున్న IASల సంఖ్య తగ్గుతూ వస్తుంది. 2023-24 లో ట్రైనింగ్ పూర్తి చేసిన ఐపీఎస్ అధికారుల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే వారు 1 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
కాంగ్రెస్ను బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీహిల్స్ లో కొట్టబోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్లో కొడుతామని తేల్చి చెప్పారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడని మండిపడ్డారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. శత్రువుకు లొంగిపోయిన వారు విప్లవ ప్రతిఘాతకులు, విచ్ఛిత్తి ద్రోహులు అని లేఖలో పేర్కొంది. సోనూ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ రావు, సతీష్ కు విప్లవ ప్రజలు తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లాలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. తల్లిదండ్రులు, గ్రామస్థులు, కమ్యూనిస్ట్ నాయకులు కన్నీటిపర్యంతమై తుది వీడ్కోలు పలికారు.
ఓరుగల్లు అంటే ఒకప్పుడు ఆజం జాహీ మిల్లు గుర్తుకు వచ్చేదని KTR తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ మిల్లు కేవలం పదివేల మందికి ఉపాధిని కల్పించిన మిల్లు మాత్రమే కాదని.. వరంగల్, హన్మకొండ పట్టణాలకు విద్యుత్ వెలుగులను ప్రసాదించిన మిల్ అని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి ఆజం జాహీ మిల్లు మూతపడిందని చెప్పారు.
హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కాస్త రిలాక్స్ అయింది. నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడానికి నిత్యం శ్రమించే హైడ్రా క్రికెట్ ఆటతో సేదతీరింది. వర్షాకాలం వరద కష్టాలు తీర్చడంలో తలామునకలైన హైడ్రా క్రికెట్ ఆడి సందడిగా గడిపింది.
బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పారని.. అన్నీ తెలిసినా బీసీలను మోసం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని చెప్పారు.
అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అహ్వానం అందింది. ఈ మేరకు ముఖ్యమంత్రిని కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ హరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందజేశారు.
సర్వధర్మ సమభావన, హైందవ ధర్మం నిత్యనూతనమనేది బీజేపీ నినాదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ స్పష్టం చేశారు. లోకాకళ్యాణార్థo..అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం దేశవ్యాప్తంగా యాగాలు నిర్వహిస్తామని చెప్పారు.
బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.