Home » Politics
డీజీపీ ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గో రక్షక్ దళ్ సభ్యుల కాల్పుల ఘటనపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. నిన్న జరిగిన సోనూ సింగ్ పై కాల్పులను నిరసిస్తూ ధర్నాకు దిగారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదర్ పండుగను అధికారికంగా జరిపారని హరీశ్ రావు గుర్తుచేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో ఇక్కడ వేదికను ప్రభుత్వమే వేసి.. దున్నలను తెచ్చిన వారికి వెండి బిళ్లలను ప్రభుత్వం తరపున అందించారని చెప్పారు.
కర్మను తప్పించుకోకగలమోమే గానీ, విద్యుత్ బిల్లుల మొతను తప్పించుకోలేమని.. మన బిడ్డలైనా కట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఒక రూపాయి వస్తువును ఎవడో మూడు రూపాయలకు కొని అవినీతికి పాల్పడితే వినియోగ దారుడు ఎందుకు భారం మోయాలి? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే హైదరాబాదులో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని హరీశ్ రావు చెప్పారు. తమ హయాంలో 110 రకాల మందులు ఉచితంగా అందించే వాళ్ళమని పేర్కొన్నారు. 130 రకాల పరీక్షలను ఉచితంగా చేసి పేషంట్ల ఫోన్ లకే రిపోర్టులు పంపించే వాళ్ళమని చెప్పారు.
మూడు రోజుల కింద నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారని గుర్తుచేశారు. భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఏపీ కేబినెట్ నవంబర్ 7న భేటీ కానుంది. విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుపై మంత్రి వర్గం చర్చించనుంది. మంత్రులు అందరికీ సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు.
జీవన్ రెడ్డి తమ సీనియర్ నేత అని.. ఆయన చెప్తున్న అంశాలను పరిశీలిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై అధ్యయనం చేస్తామన్నారు. జీవన్ రెడ్డికి ఏమైనా సమస్యలుంటే అక్కడి మంత్రి లక్ష్మణ్ పరిష్కరిస్తారని చెప్పారు. మంత్రుల్లో తనకంటే సీనియర్లు ఉన్నారని. తనకంటే జూనియర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు.
జాతీయ పోలీస్ స్మారక స్థూపం వద్ద అసువులు బాసిన పోలీసుల అమర వీరుల సేవలను స్మరిస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శ్రద్దాంజలి ఘటించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అధికారికంగా 'X' వేదికగా ప్రకటన విడుదల చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేటితో చివరి రోజు ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు స్వీకరించనున్నారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మొత్తం 94 మంది 127 సెట్ల నామినేషన్లను దాఖలు అయ్యాయి.
కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో ఫుడ్ పాయిజన్ 20 మందికి పైగా అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.