Home » Pahalgam Attack
భారత్ను ప్రమాదంలో పడెయ్యాలని చూస్తే ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూస్తారంటూ పొరుగు దేశం పాకిస్థాన్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటితో ఏడాది పూర్తయింది.
గతేడాది ఏప్రిల్లో జమ్మూ, కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని నివ్వెరపరిచింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలపై భారత సైన్యం దాడులు చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడితో భారతదేశ ఐక్యతను దెబ్బతీయలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఒక్కటిగా నిలుస్తోందన్నారు.
పహల్గామ్లో ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా భారత్లోని వివిధ దేశాల రాయబారులు, అంతర్జాతీయ ప్రతినిధులు దేశ ప్రజలకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. మృతులకు నివాళులర్పిస్తూ, ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో పాక్లోని ఉగ్రస్థావరాలు నేలమట్టం కావడాన్ని సైఫుల్లా కసూరీ అంగీకరిస్తూనే, భారత్ చాలా పెద్ద తప్పుచేసిందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
హహల్గాం దాడిలో పాకిస్థాన్ కుట్ర, నిందితుల పాత్ర, వాటిని బలపరచే సాక్ష్యాలను ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది. నిషేధిత ఎల్ఈటీ/టీఆర్ఎఫ్ సంస్థ ఈ కుట్రకు ప్రణాళిక రచించి దాన్ని అమలు చేసినట్టు తెలిపింది.
ఈ సారి మామూలుగా ఉండదు. ఊచకోతే.. అని పాకిస్థాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు భారత వెస్ట్రన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్. పాకిస్థాన్ మళ్లీ పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు చేపట్టే అవకాశం ఉందని..
పాక్ ఉగ్రచర్యకు గట్టి ప్రతీకారం తీర్చుకోవాలనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉందని, అయితే ఉగ్రదాడి అనంతరం చేపట్టిన మిలటరీ ఆపరేషన్ను ముగించడంతో మంచి అవకాశాన్ని కేంద్ర జారవిడుచుకుందని ఒవైసీ అన్నారు.
భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకోవడం, దాన్ని భారత్ తిప్పికొట్టిన క్రమంలో దీనిపై అంతర్జాతీయ సమాజంలో తలెత్తిన ప్రశ్నలకు కూడా ఈ వీడియో సమాధానం ఇచ్చింది.
లష్కరే తొయిబా ముసుగు సంస్థ అయిన టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థను పాకిస్థాన్ ఏర్పాటు చేసింది. దీనిని జమ్మూకశ్మీర్లో వేళ్లూనుకునేలా చేసి స్థానిక సంస్థగా ప్రాజెక్ట్ చేసింది. తద్వారా జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడులు కొనసాగించడం, ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) స్క్రూటినీలోకి రాకుండా చూసుకోవడం పాక్ వ్యూహంగా ఉన్నట్టు ఎన్ఐఏ పేర్కొంది.