Home » Operation Sindoor
ఈ సారి మామూలుగా ఉండదు. ఊచకోతే.. అని పాకిస్థాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు భారత వెస్ట్రన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్. పాకిస్థాన్ మళ్లీ పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు చేపట్టే అవకాశం ఉందని..
బికనీర్ మిలటరీ స్టేషన్తో సహా పలు ఫార్వార్డ్ ఏరియాల్లో శుక్రవారం నాడు ఉపేంద్ర ద్వివేది పర్యటించారు. బలగాల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.
ఆపరేషన్ సిందూర్పై ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గూస్బమ్స్ కామెంట్లు చేశారు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టామని అన్నారు. ఐఏఎఫ్ సత్తా ఎలాంటిదో ప్రపంచం చూసిందని, శత్రువుల స్థావరాలపై కచ్చితత్వంతో దాడి చేశామని ఆయన చెప్పారు.
పాక్ ఉగ్రచర్యకు గట్టి ప్రతీకారం తీర్చుకోవాలనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉందని, అయితే ఉగ్రదాడి అనంతరం చేపట్టిన మిలటరీ ఆపరేషన్ను ముగించడంతో మంచి అవకాశాన్ని కేంద్ర జారవిడుచుకుందని ఒవైసీ అన్నారు.
Operation Sindoor Live Updates in Telugu: భారత పౌరుల ప్రాణాలు బలిగొన్న ఉగ్ర మూకల అంతు చూసింది భారత సైన్యం. బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ పేరుతో త్రివిధ దళాలు సైనిక చర్యను ప్రారంభించాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిభిరాలపై దాడి చేసింది. ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతయ్యారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ప్రతి అప్డేట్ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
గతంలో రాజ్ కపూర్ అవార్డు గెలుచుకున్నపుడు ఆయనకు పది లక్షల రూపాయల నగదు బహుమతి వచ్చింది. దాన్ని మహారాష్ట్ర కరువు నివారణ కార్యక్రమాలకోసం ఇచ్చేశారు. ఇలా తరచుగా ఆర్థిక సాయాలు అందిస్తూనే ఉన్నారు.
ఉగ్రవాదులకు మద్దతిస్తోన్న పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పామని రాజ్నాథ్సింగ్ గుర్తు చేశారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ పౌరులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం చూసి వారిని మట్టుబెట్టలేదు.
భారత్తో యుద్ధం వస్తే తమకు సౌదీ అరేబియా అండగా ఉంటుందని పాక్ రక్షణ శాఖ మంత్రి తాజాగా పేర్కొన్నారు. సౌదీ, పాక్ మధ్య ఇటీవల కుదిరినది సమగ్ర రక్షణ ఒప్పందం అని కామెంట్ చేశారు.
ట్రంప్ గత మే నుంచి అమెరికా యంత్రాంగం జోక్యంతోనే రెండు అణ్వస్త్రదేశాల మధ్య యుద్ధం ఆగిపోయిందని చెబుతూ వస్తున్నారు. అయితే ఆయన వాదనను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
బహవలాపూర్లోని భారీ కాంప్లెక్స్పై భారత వాయుసేన జరిపిన దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు ప్రాణాలు కోల్పోయినట్టు మసూద్ అజార్ గత మేలో వెల్లడించారు.