Home » Oman
ఒమన్తో ఇరాన్ జరుపుతున్న చర్చలు కేవలం సాంకేతికపరమైన నావిగేషన్ మార్గాల ఖరారు కోసమేనని, హోర్ముజ్ జలసంధిని తెరవడానికి దీనికి సంబంధం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.
ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన రెండు భారీ చమురు ట్యాంకర్లపై తాము క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు యెమెన్కు చెందిన ఇరాన్ మద్దతుదారైన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
హైదరాబాద్లోని పహాడీషరీఫ్కు చెందిన షబ్నం బేగం ఒమన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ స్వదేశానికి రప్పించాలని వేడుకుంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత ఉద్ధృతమవుతోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
హోర్మూజ్ జలసంధి చుట్టూ హైటెన్షన్ పరిస్థితులు నెలకొనడంతో ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆ దేశ వాణిజ్య నౌకల యాజమాన్యాలను ఆదేశించింది.
ఒమన్ తీరంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న ఓ భారత నౌక ప్రమాదానికి గురై మునిగిపోతుండగా, అమెరికా నౌకాదళం సకాలంలో స్పందించి 14 మంది భారతీయ సిబ్బందిని కాపాడింది.
ఇటీవల ఒమన్ తీర ప్రాంతంలో చమురు నౌకలపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా భారతీయులు ఉన్న నౌకపై దాడి జరిగిందని, పలువురు మృతి చెందారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది.
పశ్చిమాసియా సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఒమన్ తీరంలో వాణిజ్య నౌక ప్రమాదానికి గురైంది. ఇవాళ ఒమన్ తీరానికి సమీపంలో ‘ఎంటీ జల్వీర్’ అనే చమురు నౌకలోని ఇంజిన్ రూమ్లో అకస్మాత్తుగా పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు తాజాగా ఇద్దరు భారతీయుల ప్రాణాలను బలగొన్నాయి. ఒమన్ గల్ఫ్లో ఓ ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ చేపట్టిన దాడుల్లో ఈ ఘటన జరిగింది.
హర్ముజ్ జలసంధిలోని ఓ ఆయిల్ ట్యాంకర్పై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందారు.