భారత్-ఒమన్ మధ్య కీలక ఒప్పందాలు

ABN, Publish Date - Dec 18 , 2025 | 12:50 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండవ రోజు ఒమన్‌లో పర్యటిస్తూ ఉన్నారు. పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై చర్చించారు. ఒమన్‌లోని ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం అయ్యారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండవ రోజు ఒమన్‌లో పర్యటిస్తూ ఉన్నారు. పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై చర్చించారు. ఒమన్‌లోని ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం అయ్యారు. సమావేశంలో వారిని ఉద్దేశించి మాట్లాడారు. కాగా, ప్రధాని మోదీ నిన్న(బుధవారం) ఇథియోపియాలో పర్యటించారు. ఇథియోపియానుంచి ఒమన్ వెళ్లారు. ఉప ప్రధాన మంత్రి సయీద్ షిహాబ్ బిన్ తారిఖ్ అలీ సైద్ మోదీకి ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాల గురించి చర్చించారు.


ఇవి కూడా చదవండి

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్..

మాతృభూమి సేవలోనే నిజమైన ఆనందం

Updated at - Dec 18 , 2025 | 12:50 PM