Home » NTR District
ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలను డంపింగ్ యార్డుల రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లు ఉన్నాయని, కొత్తగా మరో ఆరు ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపించింది. సుమారు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు భారీ వృక్షాలు కుప్పకూలాయి. వివరాల్లోకి వెళితే..
చంద్రశేఖర్ అనే వ్యక్తి మనస్థాపంతో చనిపోతున్నానని సెల్ఫోన్ ద్వారా మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ఆఫ్ చేసి కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ మెసేజ్తో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు.
ఇంధన పొదుపు చర్యల్లో అందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. బ్యాటరీ బైక్లే కాదు.. బ్యాటరీ సైకిళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో వైభవంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. బాపు మ్యూజియంలోని విక్టోరియా హాల్లో నిర్వహించే లేజర్ షోకు ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
పామర్రులో చోటుచేసుకున్న వివాహిత హత్య కేసు నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. భర్త, అతడి సోదరులను అరెస్ట్ చేశారు.
మహిళను ఇంటికి తీసుకురావడానికి బంధువులు ఒప్పుకోకపోవటంతో ఓ యువకుడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. బ్లేడుతో గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెల్దుర్తిపాడుకు చెందిన వైసీపీ నేత బూతు పురాణం తాజాగా బయటపడింది. తన ఫోన్ ఎత్తడం లేదని వ్యవసాయ శాఖ అధికారిపై వైసీపీ నేత వేలాద్రి నోరు పారేసుకున్నాడు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మల కళను కాపాడేందుకు, ఈ హస్తకళాకారులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం చేపట్టింది.