Home » NTR District
మద్యం మత్తులో ఓ వ్యక్తి తన గొంతును తానే కోసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని ఏ.కొండూరు మండలం అట్ల ప్రగడ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో బోరుబావికి తలబాదుకొని చాకుతో తన మెడను కోసుకున్నాడు.
Andhrapradesh: మైలవరంలో దొంగల బీభత్సం సృష్టించారు. మైలవరంలోని విజయ మిల్క్ డైరీ, రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. రాత్రి షాపులు మూసివేసిన తర్వాత వైన్ షాపుల్లో దొంగతనం చేశారు.
శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు వైసీపీ ప్రభుత్వం అప్పనంగా ఆస్తులు కట్టబెడుతోందని బందర్ ఎంపీ వల్లభనేని బాలశౌరి(MP Balashouri) ఆరోపించారు.
జిల్లాలోని రెడ్డిగూడెంలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతోంది. మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వ్యాపారం సాగుతోంది. జిల్లా మంత్రి అండదండలతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: కోస్తా జిల్లాలో గురువారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో జాతీయ రహదారిపై వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సరిగా కనిపించకపోవడంతో పలు ప్రాంతాల్లో డ్రైవర్లు వాహనాలు నిలిపివేశారు.
జిల్లాలోని నందిగామలో అరటి గెల అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. నందిగామకు చెందిన విశ్రాంత విద్యాశాఖ అధికారి కేజెడ్ఎస్ కుమార్ ఇంటి ఆవరణలోని అరటి చెట్టుకు 9అడుగుల పొడవైన అరటిగెల కాసింది. ఈ విషయం..
Andhrapradesh: తనపై మీమ్స్ వీడియోలు ప్రదర్శించడంపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఈరోజు ఏసీపీకి ఫిర్యాదు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధమయ్యారు.
కేశినేని నాని, కృష్ణ ప్రసాద్పై తెలుగుదేశం సినీయర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ విమానం విశాఖ వెళ్లిపోతే ఈ కేశినేని నాని మూసుకుని కూర్చున్నారని.. ‘నేను విజయవాడను ఉడదీసా, ఇరగదీసా’ అంటారని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తిరువూరు వైసీపీ సీట్ తనకి రాదని సమాచారం రావటంతో మనస్తపం చెందిన రక్షణ నిధి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది.
Andhrapradesh: తమ సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించడానికి మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈరోజు మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ను ముట్టడించనున్నారు.