Home » NRI News
ఖతర్లోని ఆంధ్ర కళా వేదిక ప్రవాసీ తెలుగు సంఘానికి ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ప్రముఖ ప్రవాసీ గొట్టిపాటి రమణ అనూహ్యంగా అఖండ విజయం సాధించారు. అంతేకాకుండా తమ గెలుపు నల్లేరుమీద నడకే అన్న విశ్వాసంతో ఉన్న ప్రత్యర్ధి శిబిరం నుండి పోటీ చేసిన వారిలో..
అక్టోబర్ 29వ తేదీ ఆదివారం నాడు ‘తెలుగు వనంలో గజల్ పరిమళం’ పేరిట సదస్సు జరగనుంది. కొరుప్రోలు మాధవరావు, విజయలక్ష్మి కందిబండ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పాకలపాటి వేణు గోపాల కృష్ణంరాజు తన మధుర గానంతో కార్యక్రమానికి వచ్చిన వారిని అలరించనున్నారు.
పాఠశాల 2025 - 26 నూతన విద్యా సంవత్సరం అట్లాంటాలో ‘‘పలక బలపం’’ కార్యక్రమంతో విజయవంతంగా ప్రారంభమైంది. గురువుల పరిచయాలతో.. తల్లిదండ్రులు, విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణలతో కార్యక్రమం ఆత్మీయంగా సాగింది.
ఈ కార్యక్రమాన్ని గ్రేస్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గంగాధర్ సుంకర, తానా రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ చంద్ నరేపలుపు సమన్వయం చేశారు. న్యూజెర్సీ, పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమెరికాలోని డల్లాస్లో రెండు పుస్తకాల పరిచయ సభ ఘనంగా జరిగింది. ‘ఊహల కందని మొరాకో’, ‘మనమెరుగని లాటిన్ అమెరికా’ పేర్లతో నిమ్మగడ్డ శేషగిరి ఫేస్బుక్లో రాసిన కథనాలను, ప్రముఖ రచయిత దాసరి అమరేంద్ర తెలుగులోకి అనువదించారు. ఈ రెండు పుస్తకాల పరిచయ కార్యక్రమం.. డల్లాస్లోని సాహితీప్రియుల మధ్య నిర్వహించారు.
విశ్వవ్యాప్తంగా తమ రాష్ట్ర ప్రవాసీయులలో మలయాళీ భాష వ్యాప్తి, ప్రవాసీయుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించే ప్రయత్నంలో భాగంగా పినరయి విజయన్ తలపెట్టిన పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది.
మాతృభూమికి దూరంగా విదేశాల్లో ఉంటూ తమ సంస్కృతిని పరిరక్షించుకోవడంతో పాటు అపదలో ఉండే సహచర తెలుగువారికి ఆపన్నహస్తం అందించడానికి ఉద్దేశించిన తెలుగు ప్రవాసీ సంఘాలు ఒక ప్రహాసంగా మారుతున్నాయి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం గ్రేటర్ అట్లాంటాలోని చార్లెస్టన్ పార్క్, లేక్ లేనియర్ కమ్మింగ్ లో నిర్వహించిన తానా హైక్ అండ్ కనెక్ట్ కార్యక్రమం అద్భుత విజయం సాధించింది. లేక్ లేనియర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో తానా సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు కార్యక్రమాన్ని భారత రాయబార కార్యాలయం విజయవంతంగా నిర్వహించింది. తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద.. భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు అసోసియెషన్ ఇటీవల బతుకమ్మ సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. ప్రప్రథమంగా దుబాయిలోని భారతీయ కాన్సుల్ జనరల్ సతీశ్ కుమార్ శివన్ తో పాటు స్థానిక ఇమరాతీ జాతీయులైన కొందరు ప్రముఖులు, దుబాయి ప్రభుత్వ అధికారులు కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.