NRI news: బ్రూనైలో విజయవంతంగా.. వికసిత్ భారత్ పరుగు
ABN , Publish Date - Oct 08 , 2025 | 07:20 PM
బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు కార్యక్రమాన్ని భారత రాయబార కార్యాలయం విజయవంతంగా నిర్వహించింది. తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద.. భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు కార్యక్రమాన్ని భారత రాయబార కార్యాలయం విజయవంతంగా నిర్వహించింది. తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద.. భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు, భారతీయ ప్రవాసులు, బ్రూనై పౌరులతో సహా 150 మందికి పైగా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.

పాల్గొన్న వారంతా.. వికసిత్ భారత్ 2047 దిశగా భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ అంకితభావాన్ని ప్రకటిస్తూ ఐక్యతతో పరుగెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, సంఘీభావం, దేశభక్తిని అద్భుతంగా ప్రతిబింబించినట్లైంది. ఈ సందర్భంగా పాల్గొన్నవారిని ఉద్దేశించి భారత రాయబారి రాము అబ్బగాని గారు మాట్లాడుతూ, అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశ అభివృద్ధి కోసం అవసరమైతే 16 గంటల పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బ్రూనై తెలుగు సంఘం సైతం సక్రియంగా పాల్గొనడం విశేషం. వారు నిరంతరం భారత జాతీయ కార్యక్రమాల పట్ల తమ అంకితభావాన్ని మరియు ప్రవాస భారతీయుల ఐక్యతను చాటిచెప్పారు. ఈ కార్యక్రమం ఘన విజయవంతం కాగా, వికసిత్ భారత్ దిశగా బ్రూనైలోని భారతీయ సమాజం యొక్క భాగస్వామ్య భావనను ప్రతినిధ్యం వహించింది.

ఇవి కూడా చదవండి..
దుబాయిలో ఇంకా పరిమళిస్తున్న బతుకమ్మ పూలు
తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా(TSN)నూతన కార్యవర్గం
మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..