Home » NRI Latest News
ఎడారి దేశాలలో తెలుగు తమ్ముళ్లు మరోసారి కదం తొక్కారు. ఉత్సాహంతో ఉరకలేస్తూ తమ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
ఇటీవల మృతి చెందిన ఒక గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్ధిక సహాయం మంజూరైంది.
అమెరికాలో నాట్స్ సంస్థ ప్రవాస భారతీయుల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు వెల్నెస్ వెబినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, వెల్నెస్ కోచ్, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. లీజర్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ ఈ వేడుకలకు వేదికగా నిలిచింది.
న్యూజెర్సీలోని ఎడిసన్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. 'స్థానిక సమాజానికి సేవ' కార్యక్రమంలో భాగంగా సుమారు 600 మందికి ఆహారం, అవసరమైన సరుకులు అందించారు.
తమ ప్రియతమ నేత, టీడీపీ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను గల్ఫ్ దేశాలలోని టీడీపీ అభిమానుల్లో అత్యధికులు ముందస్తుగా నిర్వహించుకుంటున్నారు.
ఒమాన్ దేశంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మస్కట్, సలాల నగరాలలో వేర్వేరుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దళిత సంఘాలు కార్యక్రమాలను నిర్వహించాయి.
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అభిమానులు కువైత్తో తాజాగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
గల్ఫ్లో దర్జీలుగా తెలుగువారు రాణిస్తున్నారు. అరబ్బు దుస్తులను కుట్టడంలో సృజనాత్మకను ప్రదర్శిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
యు.ఎ.ఇ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో తెలుగు దళితులు తమ శక్తిని ప్రదర్శించగా అందులో మహిళలు తమ విశిష్టతను చాటారు.