Home » NRI Latest News
అమెరికాలోని ఎన్నారైలు భారత్ తరపున అగ్రరాజ్యంలో తమ గొంతు వినిపించడంలో విఫలమయ్యారని ఎయిర్ఫోర్డ్ రిటైర్డ్ అధికారి ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
సిడ్నీ నగరంలో తెలుగు సంస్థల ఆధ్వర్యంలో అష్టావధాన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ పురపాలకమండలి సభ్యులు సంధ్యారెడ్డి.. అవధాని తటవర్తి కళ్యాణ చక్రవర్తిని, సంచాలకులను, నిర్వాహక సంస్థలను అభినందించారు.
వాల్మార్ట్లో ఇటీవల కొందరు అసోసియేట్స్ తొలగింపునకు, హెచ్-1బీ వీసా దుర్వినియోగానికి ఎలాంటి సంబంధం లేదని సంస్థ తాజాగా పేర్కొంది. విదేశీ వర్కర్ల నియామకానికి ప్రతిగా డబ్బులు చేతులు మారాయని సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో సంస్థ ఈ మేరకు స్పందించింది.
శుక్రవారం లండన్లోని ఓ భారతీయ రెస్టారెంట్కు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పోలీసులు ఇప్పటికే ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
న్యూయార్క్లో ఇటీవల టూరిస్టు బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ భారతీయుడు కూడా మరణించినట్టు అధికారులు తాజాగా గుర్తించారు. మృతుల వివరాలను వెల్లడించారు.
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త ఆధ్వర్యంలో హ్యూస్టన్లో 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు వైభవంగా జరిగింది. ఈ సదస్సులో భారత దేశం నుంచి 15 మంది ప్రముఖ సాహితీవేత్తలు, అమెరికాలో పలు నగరాల నుండి 75 మందికి పైగా విచ్చేశారు. 28 విభిన్న వేదికల్లో సుమారు 250 మంది ఆహూతుల సమక్షంలో తెలుగు భాషాసాహిత్య సౌరభాలను పంచుకున్నారు.
ఛార్లెట్లో తానా చేపట్టిన బ్యాక్ ప్యాక్ కార్యక్రమం విజయవంతమైంది. హార్నెట్ నెస్ట్ ఎలిమెంటరీ స్కూల్లోని పేద పిల్లలకు ఈ కార్యక్రమం కింద దాదాపు 300కు పైగా బ్యాగ్లను అందజేశారు.
ట్రంప్ సర్కారు కఠిన వైఖరి కారణంగా అమెరికాలోకి వలసలు భారీగా తగ్గాయని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో వలసలు ఏకంగా 1.5 మిలియన్ల మేర తగ్గినట్టు సంస్థ అధ్యయనంలో తేలింది. ఫలితంగా జనాభాలో వలసదారుల వాటా 15.8 శాతం నుంచి 15.4 శాతానికి పడిపోయింది.
వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 55 వీసాదారులపై నజర్ పెట్టింది. వారి వివరాలను సమీక్షిస్తున్నట్టు పేర్కొంది.
రాజ్యసభ మాజీ సభ్యులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కు టెక్సాస్ రాష్ట్రంలో అరుదైన గౌరవం లభించింది. టెక్సస్ రాష్ట్ర ప్రభుత్వంతో సహా, డాలస్ పరిసర ప్రాంతంలో ఉన్న మూడు ముఖ్య నగరాలైన ఫ్రిస్కో, గార్లండ్, లిటిల్ ఎల్మ్ నగరాల మేయర్లు ఆయనకు అభినందన పూర్వక అధికారిక గుర్తింపు పత్రాలు అందజేశారు.