Home » Nizamabad
CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్పై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను ముప్పుతిప్పలు పెట్టారని.. పదేళ్ల పాటు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పారని విమర్శించారు. ‘‘నేను చెప్పింది నిజమైతేనే మాకు ఓటు వేయండి’’ అని కోరారు.
నిజామాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. అడవి పందుల వేటకు వెళ్లిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు.
Dharmapuri Arvind Sawal: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ సవాల్ విసిరారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతోన్న హైడ్రాను.. హైదరాబాద్ ఓల్డ్ సీటీలో అమలు చేయగలరా? అని సూటిగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేల్పూర్ వద్ద స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేసామని, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కవిత అన్నారు. జక్రాన్ పల్లి వద్ద ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ అర్వింద్ మాటలు చెప్పడం కాదని, చేతల్లో చూపించాలన్నారు. పసుపు బోర్డులో అందరికీ అవకాశం ఇవ్వాలని, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి రైతుల కోసం పని చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కావడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఒకటైనా నిజామాబాద్ లోకల్ వ్యక్తి కావడంతో మహేష్ గౌడ్కు ఈ ఎన్నికలు సవాల్గా మారాయి.
తన కు రావాల్సిన చిట్టీ డబ్బులు అడిగినందుకు ఓ మహిళను దారుణంగా హత్య చేశాడో వ్యాపారి. ఆరు నెలల తర్వాత విషయం బయటపడింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
Union Minister Piyush Goyal: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తానని చెప్పారని.. ఆహామీని నిలబెట్టుకున్నారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మోదీ ఏదైనా చెప్పారంటే అది నెరవేరి తీరుతుందని చెప్పారు.ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్రమంత్రి బండి సంజయ్ కోరిక మేరకు సంక్రాంతి రోజున ప్రారంభిస్తున్నామని అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ సహా 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండించే రైతుల కోసం ప్రధాని మోదీ ఒక బహుమతిగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్ఘాటించారు.
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ను సోమవారం విధుల నుంచి తొలగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు.
నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు మంగళవారం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు.
నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి ఈసారి టికెట్ దక్కట్లేదా? ఆ సీటుకు కాంగ్రెస్ పార్టీ, మరో అభ్యర్థిని నిలబెట్టనుందా? ఈ ప్రశ్నలకు గాంధీభవన్ వర్గాలు అవుననే అంటున్నాయి.