Home » Nara Lokesh
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అలాగే పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను కూడా పార్టీ ప్రకటించింది.
ఈరోజు (ఏప్రిల్ 14) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. దేశం కోసం బాబాసాహెబ్ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
పార్లమెంట్లో మహిళ రిజర్వేషన్ బిల్లు కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు కూటమిలోని పార్టీలు మద్దతు ప్రకటించనున్నాయి. దాంతో ఆయా పార్టీలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వేదికగా మద్దతు తెలపనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఎన్డీయే ఎంపీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి లోకేశ్, ఎన్డీయే ఎంపీలు కృతజ్ఞతలు తెలియజేశారు.
నేటి సమాజం.. సర్వం సోషల్ మీడియా మయం. మారుతున్న కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దాని దుష్ప్రభావాల నుంచి భావి తరాలను కాపాడుకోవాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ‘మావిగన్’ రాజధాని ప్రతిపాద ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి లోకేశ్ మావిగన్ అర్థం ఇదేనా జగన్ అంటూ ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడమే తమ సిద్ధాంతమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్టీకి అండగా నిలిచిన వారిని ఎప్పటికీ విస్మరించేది లేదన్నారు.
హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకల దాడి యత్నాన్ని సీఎం చంద్రబాబుతో సహా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు.
ఇవాళ హైదరాబాద్లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా ఆందోళనకారులు వికృత క్రీడలు సాగించారు. ఈ దాడులను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.
అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై మద్దతు ఇచ్చిన పార్టీలకు మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతిని కాపాడింది పార్లమెంట్ కాపాడిందని చెప్పారు.