Home » Nara Chandra Babu Naidu
మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి (Minister Kakani Govarthan Reddy) కనీసం తన నియోజకవర్గానికైనా న్యాయం చేశారా? అని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఇలాంటి వారు మంత్రులు కాబట్టే ప్రజాస్వామ్యం విలవిలలాడుతోందని అన్నారు. శనివారం నాడు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
జలగన్న జగన్కు ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క చాన్సే... చివరి చాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దోపిడీ, విధ్వంసమే సీఎం జగన్ నైజమని మండిపడ్డారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ పత్రాలను ఆయన స్వయంగా కాకుండా.. సతీమణి నారా భువనేశ్వరితో (Nara Bhuvaneshwari) నామినేషన్ దాఖలు చేయిస్తున్నారు. మధ్యాహ్నం 01:27 గంటలకు రిటర్నింగ్ అధికారికి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు..
కర్నూలు జిల్లా: ప్రజాగళం యాత్రంలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కర్నూలు జిల్లా, ఆలూరులో పర్యటించనున్నారు. ఆలూరు అంబేద్కర్ సెంటర్లో సాయంత్రం మూడు గంటలకు ప్రజాగళం సభలో పాల్గొంటారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరపున రెండు సెట్ల నామినేషన్ను ఆమె దాఖలు చేయనున్నారు.
కృష్ణా జిల్లా: వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగనాసుర వధ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు పిలుపిచ్చారు. పెడన సభలో వైసీపీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ ఐదేళ్లపాటు పరదాలు కట్టుకుని తిరిగారంటూ ఎద్దేవా చేశారు.
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్ కల్యాణ్ బుధవారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు.
మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రెడ్డి (CM Jagan) రైతులను నట్టేట ముంచారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. సోమవారం నాడు నందికొట్కూరు పటేల్ సెంటర్లో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభకు తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ పార్టీ అధినేతలు ఓ రేంజ్లో కీలక ప్రకటనలు చేసేస్తున్నారు. మేనిఫెస్టో కంటే ముందే సూపర్ సిక్స్తో జనాల్లోకి దూసుకెళ్లిన టీడీపీ.. ఇప్పుడు ప్రజాగళం పేరిట నియోజకవర్గాలు, జిల్లాలను కవర్ చేస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముందుకు సాగుతున్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అచ్చు తప్పులు..? వైఎస్ జగన్ సర్కార్ ఘోర వైఫల్యాలను వెలికి తీస్తూ ప్రజలకు నిశితంగా వివరిస్తూ వెళ్తున్నారు...
జగన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. సోమవారం నాడు రాజాంలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.