Home » Nalgonda
సూర్యాపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. ఐదుగురు టీచర్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది.
సంక్రాంతి రిటర్న్ జర్నీలో రద్దీ నియంత్రణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 65వ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనుల నేపథ్యంలో ప్రత్యేక ట్రాఫిక్ చర్యలు చేపట్టారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సు సర్వీసులతను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీలత తెలిపారు. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాలకు ఎల్బీనగర్ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.
కోదాడ పట్టణంలో కస్టోడియల్ డెత్ మృతుడు కర్ల రాజేష్ కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ పరామర్శించారు. రాజేష్ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, మృతికి కారుకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
లాకప్ డెత్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై సురేశ్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేయడంపై మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఎస్సైను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారని మండిపడ్డారు.
తెలంగాణలో తొలి విడత గ్రామ పంచయతీ ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. ఎన్నికల కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టామని వాపోతున్నారు.
గియ్యాల నీవు మంచోడవా పెద్దోడివా అని జనం సూత్తలేరు. ఎన్ని పైసలు ఖర్చు పెడతడు అని చూత్తరు.. గిది గియ్యాల పరత్తితి-సర్పంచ్ అభ్యర్థి ఒక సామన్యుడి మధ్య జరిగిన సరదా సంభాషణ నేటి రచ్చబండ..
కోర్టులో ఓడిన వారు ఏడిస్తే, గెలిచిన వారు ఇంటికి వచ్చి ఏడ్చిన మాదిరి తమ పరిస్థితి ఉందని ఏకగ్రీవాల్లో సర్పంచ్లుగా ఎన్నికైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవంతో డబ్బు భారం ఉండదులే అనుకుంటే, మరో రూ.20లక్షలు? పెట్టాల్సి వస్తుందని, బుద్ధి ఉండి ఎన్నికలలో పోటీ చేయవద్దని బావురమంటున్నారు.
సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. డిసెంబరు 4నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతాయని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్లో కోమటి రెడ్డి బ్రదర్స్ వార్ కంటిన్యూ అవుతోంది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడి విషయంలో అన్న ఓ వైపు తమ్ముడు ఓ వైపు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.