Home » Mudragada Padmanabham
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయ్..! దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు చివరి అస్త్రాలుగా ఏమున్నాయా..? అని బయటికి తీసే పనిలో నిమగ్నమయ్యాయి. కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే.. కీలక నేతలు, పార్టీల అధిపతులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ (YSR Congress) ఓ రేంజిలో టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పిఠాపురం (Pithapuram) నుంచి పోటీచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్పై (Pawan Kalyan) కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను (Mudragada Padmanabham) ఉసిగొల్పింది వైసీపీ..
పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ గెలవడని ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు. ఒకవేళ పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని వివరించారు. ఆ అంశంపై వర్మ స్పందిస్తూ.. ఎన్నికల వరకు ఎందుకు ఇప్పుడే సిద్ధంగా ఉండు అని ప్రతి సవాల్ విసిరారు.
ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. జగన్ ఐదేళ్ల పాలనపై ఏపీ ప్రజలు అసంతృప్తితో ఉండటంతో.. ప్రజల మూడ్ను మార్చేందుకు జగన్ అండ్ కో అనేక కుట్రలకు పాల్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓ వైపు జగన్ గెలవడంతో పాటు.. మరోవైపు విపక్షంలో కీలక నేతలను ఓడించేందుకు వైసీపీ అధినేత జగన్ కుట్రలు చేస్తున్న విషయం బయటకు వచ్చింది.
‘‘ మా నాన్నని నమ్మొద్దు’’ అంటూ తన కూతురు ముద్రగడ క్రాంతి భారత్ చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. ‘‘నా కూతురి వ్యాఖ్యలకు భయపడను. నా కూతురు నా ప్రాపర్టీ కాదు’’ అని ముద్రగడ పద్మనాభం అన్నారు. తన కూతురికి పెళ్లి అవ్వకముందు తన ప్రాపర్టీ.. పెళ్లి అయ్యాక అత్తగారి ప్రాపర్టీ అని వ్యాఖ్యానించారు.
కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ఆయన కూతురు ముద్రగడ క్రాంతిభారతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిఠాపురలంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత కోసం ముద్రగడ ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో గెలిచి, పవన్ కల్యాణ్ను తన్ని తరిమేస్తానని అహంకారంతో మాట్లాడారు. పిఠాపురంలో వంగ గీత గెలవకుంటే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ క్రాంతి భారతి స్పందించారు.
Andhrapradesh: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై సినీ నటుడు పృథ్వీరాజ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపు సమాజం ముద్రగడను అసహ్యించుకుంటోందంటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం భీమవరంలో జనసేన కూటమి అభ్యర్థి అంజిబాబు తరుపున ఎన్నికల ప్రచారంలో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడను దుమ్మెత్తిపోశారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. శుక్రవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో వైసీపీ కాపు నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డబ్బులు కోసం సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చావా? అని పవన్ కల్యాణ్ను పద్మనాభం ప్రశ్నించారు.
టాలీవుడ్ ప్రముఖ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సంచాలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఆదివారం ఆయన బీఆర్ అంబేద్కర్ కోనసిమ జిల్లాలో ప్రచారం చేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాను, తన కుమారుడు వైసీపీలో చేరామని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. నేడు కిర్లంపూడిలో ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ... శుక్రవారం పిల్లల పరీక్షల దృష్ట్యా ర్యాలీ నిర్వహించినప్పుడు ధ్వనులు ఇబ్బంది కలిగిస్తుందని నిర్ణయం మార్చుకున్నానని ముద్రగడ అన్నారు.
ఎట్టకేలకు పవన్ కల్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చేసింది. జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తాను పిఠాపురం(Pithapuram) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ స్వయంగా ప్రకటించేశారు. దీంతో పిఠాపురంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇప్పటి వరకు టీడీపీ-జనసేన కూటమి తరఫున జనసేన టికెట్ను తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిల్లా శ్రీధర్ ఆశించారు. టీడీపీ నుంచి వర్మ పోటీ చేయాలని భావించారు. అయితే, పవన్ పోటీ చేస్తానని ప్రకటించడంతో..