Home » Minister Seethakka
వెయ్యేళ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యేళ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ మేరకు మేడారం కీర్తి, గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.
దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్లో చేయాల్సిన మార్పులపై కొండా సురేఖ అధికారులకు పలు సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం రాజ్ భవన్లో కలిశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్స్ పెంపు బిల్లు ఆమోదం కోసం వినతి ఇచ్చారు.
లంగాణలో భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం నెలకొంది. కామారెడ్డి జిల్లా బికనూరు తాళమండ్ల సెక్షన్లో భారీ వరద ప్రవాహంతో ట్రాక్ కింద నీరు నిలవడంతో వివిధ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే మళ్లించింది.
అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పథకాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి సీతక్క ఉద్ఘాటించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్పై మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపడ్డారు థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం అంటే ఏంటో కేటీఆర్ చెప్పాలన్నారు.
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ ఒకే కేటగిరీలో చేర్చి ఒకే రకమైన వేతనం ఇవ్వాలని, ప్రస్తుతం విధుల్లో ఉన్న
ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేయాలని మంత్రి సీతక్క కోరారు. కేటాయించిన నిధులను అదే అసెంబ్లీ నియోజకవర్గంలో, అదే జిల్లాలో సర్దుబాటు చేయాలి.. తప్ప మైదాన ప్రాంతాలకు తరలించవద్దని ఆకాంక్షించారు. సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తే ఏజెన్సీ ఏరియా వెనకబాటులోనే మగ్గిపోతుందని మంత్రి సీతక్క తెలిపారు.
నిజమైన లబ్ధిదారులకు పింఛన్లు చేరే విధంగా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని మంత్రి సీతక్క సూచించారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేద వారికి అన్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. సాంకేతిక కారణాలతో పెన్షన్ ఆలస్యం అయితే ముందే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి సీతక్క సూచించారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల గద్దెల మార్పు ..