Home » Minister Narayana
అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతోందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్కు ఇచ్చారని పేర్కొన్నారు..
అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఊపందుకుంది. పల్నాడు జిల్లాలోని కర్లపూడి - లేమల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రి, ఎమ్మెల్యేకు రైతులు ఘన స్వాగతం పలికారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించటమే ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అవుటర్ రింగ్ రోడ్డు వేయాలన్నది నుడా చైర్మన్ ఉద్దేశమని.. ఆయన ఆలోచన మంచిదేనని పేర్కొన్నారు..
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని తమకు పూర్తి క్లారిటీ ఉందని.. రాజధానిపై వైసీపీ కూడా స్పష్టత ఇవ్వాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీప గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పనులు సుమారు రూ.900కోట్లతో జరుగుతున్నాయని వెల్లడించారు.
అమరావతి క్యాపిటల్ సిటీలో నిర్మిస్తున్న మంత్రులు, జడ్జిల భవనాలను త్వరలోనే పూర్తి చూసి హ్యాండ్ ఓవర్ చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా రావడం వల్ల కొన్ని పనులు ఆలస్యం అయ్యాయని తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
తిరుపతి, విజయవాడలకు గ్రేటర్ హోదా కల్పించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. జనగణన ఉన్నందున విలీనానికి సంబంధించిన ఇబ్బందులు ఉండటంతో దీనిపై చర్చించలేదని తెలిపారు.
జరీబు, గ్రామ కంఠం ప్లాట్లపై కమిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటి వరకూ 61,793 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు.
రాజధానిలో భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. 2004 మంది ల్యాండ్ పూలింగ్కు ఇవ్వలేదని... వారితో మరోసారి మాట్లాడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.