Home » Minister Narayana
2014-19లో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లను ఏపీకి కేటాయించిందని మంత్రి నారాయణ గుర్తుచేశారు. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచామన్నారు.
జగన్ పెట్టిన పథకాలలో అవినీతిపై ఒకరోజు చర్చ పెట్టాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ప్రస్తుతం లబ్ధిదారులను బ్యాంక్లు ఇబ్బందిపెడుతున్నాయని, జగన్ చేసిన అప్పులకు లబ్ధిదారులు బలి అవుతున్నారన్నారు.
డయేరియాపై ఏపీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
అమరావతి మునిగిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అతని అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే ఛీకొడతారని మంత్రి నారాయణ హెచ్చరించారు.
అమరావతిపై జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. 2014, 2019లో రూ. 9 వేల కోట్లు రాజధానికి ఖర్చు పెడితే అదంతా నాశనం అయ్యిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అమరావతిలో అనేక సమస్యల్ని పరిష్కరించిందని మంత్రి నారాయణ ఉద్ఘాటించారు.
మచిలీపట్నంలోని లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తామని ఆయన అన్నారు.
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారు. పునీత్ కంపెనీలో సైబర్ మోసానికి పాల్పడ్డారు. పునీత్ పేరుతో తన అకౌంటెంట్కు సైబర్ కేటుగాళ్ల మెసేజ్ చేశారు. అత్యవసరంగా రూ.1.40 కోట్లు కావాలంటూ.. అకౌంట్కు డబ్బులు పంపుమని మెసేజ్ పంపారు.
సామాన్యుల నుంచి వీఐపీల వరకూ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి కోట్లు పోగొట్టుకుంటున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునీత్ పేరిట సైబర్ నేరగాళ్లు..
వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరని మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజధాని అమరావతి మునిగిపోతుందంటున్న వారు ఇక్కడికి వచ్చి చూడాలని.. కారణాలు తెలియకుండా మాట్లాడవద్దని మంత్రి నారాయణ హితవు పలికారు.
భూముల కేటాయింపు విషయంలో మంత్రివర్గ ఉఫసంఘం తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ అధారిటీలో ఆమోదముద్ర వేశామని మంత్రి నారాయణ తెలిపారు. వీటిని ఈనెల 21వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో వీటికి ప్రభుత్వం ఆమోదం తెలపనుందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.