Home » Minister Narayana
బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కొనసాగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ అధికారులు. సహాయక చర్యల్లో భాగంగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారయణలు ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు.
రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ మరోసారి సమావేశమైంది. రైతుల ప్లాట్లకు హద్దు రాళ్లు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.
రాజధాని అమరావతిలో రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై కొందరు రైతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై మంత్రి స్పందించారు.
విశాఖలో రేపు, ఎల్లుండి జరిగే సీఐఐ సదస్సులో మంత్రి పాల్గొని.. ఏపీ సీఆర్డీయేలో పెట్టుబడులు పెట్టే సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇందుకోసం మంత్రి నారాయణ నేడు విశాఖకు చేరుకున్నారు.
పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలు కొనసాగాయని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర భవిష్యత్కు పరిశ్రమలు ఎంతో కీలకమని చెప్పారు.
బీఆ (BEEAH) ఫెసిలిటీ, టెక్టాన్ (tecton) ఇంజనీరింగ్, అరబ్ - ఇండియా స్పీసెస్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశంకానున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, రికవరీ ప్లాంట్లు, వైద్య రంగంలో బీఆ (BEEAH)ఫెసిలిటీ సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది.
గత వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలని పునర్విభజించిదని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు చేశారు. జగన్ హయాంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు జిల్లాలు పునర్విభజించిందని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.
మెుంథా తుపాన్ గురించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ముందస్తు సమాచారం అందేలా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు.
ఇంజనీరింగ్ , పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు మంత్రి నారాయణ. తాగు నీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటు అని మంత్రి నారాయణ తన ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.