Home » Minister Narayana
మెుంథా తుపాన్ గురించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ముందస్తు సమాచారం అందేలా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు.
ఇంజనీరింగ్ , పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు మంత్రి నారాయణ. తాగు నీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటు అని మంత్రి నారాయణ తన ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ప్రతి నెల ఒక థీమ్తో ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి నారాయణ. కాలుష్య నివారణ , సోలార్, గ్రీన్ ఎనర్జీ, సూర్య ఘర్ వంటి వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుందని వెల్లడించారు.
గూడూరుకు రూ.73 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.
అమరావతి నిర్మాణం గురించి మలేషియా బృందానికి మంత్రి వివరించారు. రెండున్నరేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
దక్షిణ కొరియాలోని మొదటి స్మార్ట్ సిటీ సాంగ్డో లో గ్రీన్ స్పేస్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ సెంట్రల్ పార్క్ను భారీగా నిర్మించారు. దక్షిణ కొరియా సంస్కృతి ఉట్టిపడేలా ప్రపంచంలోని అందమైన వృక్షజాతులతో అద్భుతంగా పార్క్ను నిర్మించారు.
ఫ్యూచర్ సిటీస్లో AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) థీమ్తో ఎక్స్ పో జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 200 నగరాల నుంచి 300 ప్రముఖ కంపెనీలు, 60000 వేల మంది హాజరయ్యారు. భవిష్యత్ స్మార్ట్ సిటీల నిర్మాణం, సుస్థిర ప్రజా జీవనంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలని దానిపై ఎక్స్ పో నిర్వహించారు.
దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు.
భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేసి మూడుముక్కలాట ఆడిందని మండిపడ్డారు.