Home » Minister Nara Lokesh
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో మంత్రి నారా లోకేష్ సోమవారం అసెంబ్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరులో సీటు రాక చదువుకు దూరమైన విద్యార్థిని మీనుగ జెస్సీ పొలం పనులు చేస్తోంది. విద్యార్థిని మీనుగ జెస్సీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
కేంద్రం ప్రభుత్వంతో ఆర్డీటీ సేవల గురించి మాట్లాడుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఆర్డీటీ అని ఉద్ఘాటించారు. మానవత్వానికి చిరునామా మాంఛో ఫెర్రర్ అని మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు.
గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని కూడా జగన్ గ్యాంగ్ దోచుకున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపణలు చేశారు. చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదల్లేదని ధ్వజమెత్తారు.
ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్ అతిప్రవర్తనపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాంబర్ నుంచి మంత్రి లోకేష్ బయటకు వస్తున్న సమయంలో లాబీల్లో ఇతరులను తప్పుకోండి అంటూ మార్షల్స్ హడావుడి చేశారు.
భవిష్యత్తులో బీసీ స్టడీ సర్కిళ్లు బలోపేతం చేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో ఉద్యోగాలు వచ్చేలా చేసినందుకు బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు వచ్చిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లండన్లో పర్యటిస్తున్నారు. మంగళవారం లండన్లో హైప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించారు లోకేష్.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ ముగింపు దశకు చేరుకుంది. డీఎస్సీ-2025 ఉపాధ్యాయ ఉద్యోగాలకు తుదిగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలు ఖరారయ్యాయి.
నేపాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. రియల్టైమ్ గవర్నెన్స్ సెంటర్కు వెళ్లిన మంత్రి నారా లోకేష్.. అధికారులతో సమావేశమయ్యారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. జూబ్లీహిల్స్లో తెలుగుదేశం పార్టీ పోటీపై తెలంగాణ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయాలని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.