Home » Medical News
ఫ్యాన్కోనీ అనీమియాతో బాధపడుతున్న బాలుడికి అండగా ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాశ్ నిలిచారు. రూ.20 లక్షల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నిమ్స్లో రెండున్నరేళ్లలో 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి అయ్యాయని తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిమ్స్ వైద్య బృందం మంత్రిని కలిశారు.
జిల్లాలో వైరల్, డెంగీ జ్వరాలు విజృంభించాయి. తిరుపతిలో చాలా ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిట లాడుతున్నాయి.
ఆన్లైన్ మెడికల్ షాపుల వల్ల దేశంలో ఉన్న లక్షలాది మంది మందుల వర్తకుల వ్యాపారాలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని, ఆన్లైన్ లో ఇచ్చే భారీ డిస్కౌంట్ల వెనుక ఎన్నో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. కేవలం కౌంటర్ సేల్స్ ద్వారానే అధికారులు ఎప్పటికప్పుడు మందుల నాణ్యతను తనిఖీ చేయడానికి వీలవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
వైద్యరంగంలో రోబోటిక్స్ వినియోగం రోజురోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. తాజాగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్ డియాగో పరిశోధకులు అభివృద్ధి చేసిన 'సర్జీ' అనే హ్యూమనాయిడ్ రోబోలు రెండు జీవులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించాయి.
విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్ అయ్యారు. మృతదేహాన్ని ప్రభుత్వ మహాప్రస్థానం అంబులెన్స్ ద్వారా స్వస్థలానికి చేర్చకపోవటానికి దారి తీసిన పరిస్థితులపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
భారత్లో మందుల ధరలు ఎంత తక్కువగా ఉంటాయో వివరిస్తూ ఓ అమెరికన్ మహిళ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉద్యోగుల ఆరోగ్య పథకం ట్రస్ట్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈహెచ్ఎస్ అమలుకు కొత్త బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పాటు చేస్తూ జీఓ నంబర్-40 విడుదల చేసింది.
ఎబోలాపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఎబోలాపై శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్, సర్వైలెన్స్ మరింత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు.