Home » Medaram Jathara
Telangana: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎద్దుల బండ్ల నుంచి హెలికాప్టర్ వినియోగించే వరకు జాతర తీరు మారిందన్నారు. సమ్మక్క, సారలమ్మ పూజలు రహస్యంగా జరుగుతాయన్నారు.
Telangana: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క-సారక్కా జాతర ఈరోజు నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ విషయంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. మేడారం జాతరకు ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతోందన్నారు.
రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ మొదటిసారి అధికారం చేపట్టడం, అనంతరం ఈ జాతర జరగుతుండటంతో రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఎఫెక్ట్ రైల్వే, బస్సుల్లో ప్రయాణించే రెగ్యులర్ ప్యాసింజర్స్ పై కనిపిస్తోంది. మహాజాతరకు నగరం నుంచి సిటీ బస్సులను తరలించడంతో సిటీ ట్రావెలర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మేడారం మహా జాతరకు వెళ్లాలనుకుంటున్నారా? రోడ్డు, రైలు మార్గాల ద్వారా ట్రాఫిక్, రద్దీని తట్టుకొని గంటలకొద్దీ ప్రయాణం అని జంకుతున్నారా?
మేడారం(Medaram) జాతరకు 800కు పైగా సిటీబస్సులు తరలివెళ్లనున్నాయి. 21 నుంచి 24 వరకు జరిగే జాతర కోసం గ్రేటర్జోన్లోని పలు డిపోల నుంచి దశలవారీగా బస్సులను తరలించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తునట్లు సమాచారం.
ములుగు జిల్లా: మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భాగంగా నిర్వహించే క్రతువుల్లో మరో ప్రధాన ఘట్టానికి బుధవారం అంకురార్పణ జరుగనుంది. ఈరోజు ఉదయం మండమెలిగే పండగ నిర్వహించనున్నారు.
మేడారం(Medaram) మహాజాతరను పురస్కరించుకుని ఈనెల 9నుంచి రోజూ మూడు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఎ.శ్రీధర్ తెలిపారు.