Home » Medak
భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో జరిగిన పంట, ఆస్తి నష్టాలపై నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు.. ఆగకుండా ఒకటే వాన.. కుంభవృష్టి! కామారెడ్డి, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి. వంతెనలు కూలాయి.
మెదక్ జిల్లా రామాయంపేటలోని వరద బాధిత ప్రాంతాల్లో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. సిద్దిపేట - రామాయంపేట 765 డీజీ జాతీయ రహదారిపై నందిగామ వద్ద కల్వర్టు కుంగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు.
మెదక్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 30.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. హావేలిఘనాపూర్ మండలం సర్దనలో 30 సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది. నాగపూర్లో 27 సెం. మీ వర్షపాతం నమోదైంది. చేగుంటలో 22 సెం.మీ, రామయంపేట మండలంలో 20 సెం. మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్స)ల వద్ద రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. అరకొర స్టాక్ వస్తుండటంతో తెల్లవారకముందే అన్నదాతలు పీఏసీఎ్సలకు పరుగులు తీస్తున్నారు.
ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటకతోపాటు రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతుండడంతో గోదావరి, కృష్ణ నదులు ఉగ్రరూపం దాల్చాయి. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం 6.65లక్షల క్యూసెక్కులకు చేరింది.
తెలంగాణలో ప్రత్యేకంగా ఆయిల్పాం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంగీకరించలేదు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి స్పష్టం చేశారు.
Telangana heavy rains: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 17.9 సెం.మీ భారీ వర్షం కురిసింది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.
పార్టీకి, పదవికి రాజీనామా చేయండి లేకపోతే చంపేస్తామంటూ బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావుకు మావోయిస్టుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు.
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో 700కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని ఎంపీ రఘునందన్రావు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డికి బుధవారం ఫిర్యాదు చేశారు.