Home » Medak
దుబ్బాక విఠలేశ్వరాలయంలో శివలింగ పీఠంపై కాళికాదేవీ సమేతంగా ఆసీనుడైన యోగభైరవుని శిల్పం గుర్తించారు. ఇది పాశుపత శైవంలో కీలకమైన కాలాముఖ సంప్రదాయానికి చెందినదిగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్ధారించింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఓ సంస్థ చేసిన సర్వే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ జగ్గారెడ్డిపై కేసు నమోదు అయ్యింది.
మద్యం మత్తులో జరిగిన వాగ్వాదం చివరకు హత్యకు దారితీసింది. తాగిన మైకంలో కన్న తండ్రిని చంపాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీమంత్రి తన్నీరు హరీష్రావు ఫైర్ అయ్యారు. 11లోపు రైతు బంధు ఇవ్వకుంటే రైతులు చడ్డీలో తొండలు ఇడుస్తరు.. చీరి చింతకు కడ్తరు.. అంటూ వ్యాఖ్యానించారు. అసలు.. నువ్వు ముఖ్యమంత్రివా.. వీధి రౌడీవా.. అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువైంది. నమ్మించి నా గొంతు కోశారంటూ రెబల్ అభ్యర్థి చింతల బాలమణిరాములు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి.
మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ’కాంగ్రెసోళ్ల దగ్గర మస్తు సిలకున్నయి(నగదు నిల్వలు), వాళ్లు ఇస్తే వద్దనకుండా తీసుకోండ్రి.. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నదంతా ఈ ఎన్నికల్లో పంచిపెట్టుమనుండ్రి’ అంటూ పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తింది. అలాగే పోటీలో ఉన్న అభ్యర్థలు జాబితా వెల్లడైంది. ఈ ప్రక్రియ పూర్తవగా ఆక ప్రచారాల హోరు జోరందుకుంది. అలాగే ‘విందు’ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తముతోంది. బసంతపూర్లో లేగదూడపై పులి దాడిచేసినట్లు గుర్తించారు. దీంతో ఇక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండాపోతోంది.
సంగారెడ్డి జిల్లాలో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు.