Home » Manifesto
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకుగాను (AP Elections) నామినేషన్ల పర్వం ముగియడంతో.. గెలుపోటములను నిర్ణయించే మేనిఫెస్టో రిలీజ్ చేసే పనిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. అదిగో మేనిఫెస్టో.. ఇదిగో మేనిఫెస్టో (YSRCP Manifesto) అంటూ కొద్దిరోజులుగా హడావుడి చేసిన వైసీపీ (YSR Congress) ఎట్టకేలకు శనివారం (ఏప్రిల్-27న) రిలీజ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు గాను వైసీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. క్యాంప్ కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 2019 ఎన్నికల్లో ఏమేం హామీలు ఇచ్చారు..? ఎంతవరకూ అమలు చేశారు..? ఇలా అన్ని విషయాలను నిశితంగా వివరించిన తర్వాత 2024 మేనిఫెస్టోను జగన్ రిలీజ్ చేశారు. గతంలో లాగే ఈసారి కూడా 2 పేజీలతోనే మేనిఫెస్టోను జగన్ రిలీజ్ చేయడం జరిగింది..
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ మరో రెండ్రోజుల్లో ఉందనగా ఎన్నికల మేనిఫెస్టోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు విడుదల చేసింది. తొలి దశలో కూచ్బెర్, అలిపుర్దౌర్, జలపాయ్గురిలో పోలింగ్ జరుగనుంది. టీఎంసీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో 10 ప్రధాన హామీలను ప్రకటించింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏప్రియల్ 19న తొలివిడత పోలింగ్ జరగనుంది. ఏడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేశాయి. ముందుకు ప్రజలను ఆకర్షించేందుకు మేనిఫెస్టోలతో రెడీ అయ్యాయి.
బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ మేనిఫెస్టో రూపొందించిందని, నెరవేర్చలేని వాగ్దానాలను ఇచ్చిందని కాంగ్రెస్, ఆప్ మండిపడ్డాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అని, పంటకు కనీస మద్దతు ధర పెంచుతామని వాగ్దానం చేశాయి. గత పదేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డాయి.
BJP Manifesto 2024: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో(BJP Manifesto) విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కీలక ప్రసంగం చేశారు. వచ్చే ఐదేళ్లు కూడా ఉచిత రేషన్(Free Ration) అందజేస్తామని ప్రకటించారు. అంతకంటే ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం(Free Treatment) అందిస్తామని ప్రకటించారు.
మరో సారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో బీజేపీ ( BJP ) ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అన్ని వర్గాల అభివృద్ధే కమలం పార్టీ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 7
కేంద్రంలో ప్రతిపక్షం ఇండియన్ నేషనల్ డెలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలియన్స్ (ఇండియా కూటమి) అధికారంలోకి వస్తే... కోటి ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. అలాగే రూ. 500కే సిలండర్ దేశవ్యాప్తంగా అందిస్తామన్నారు.
లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ 400 చేరుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు గల మార్గాలను అన్వేషిస్తోంది. దేశ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఇప్పటికే సంకల్ప్ సంకల్ప్ పత్ర్ పేరుతో మేనిఫెస్టోను సిద్ధం చేసింది. దీనిని ఈనెల14 తేదీన ..
''మోదీస్ గ్యారెంటీ: డవలప్డ్ ఇండియా 2047'' అనే థీమ్తో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ సిద్ధం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం విడుదల కానుంది.