Home » Mancherial
నెన్నెల-కోనం పేట రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఉన్న ప్పటికీ అధికారులు పనులు నిలిపి వేయడంపై కోనం పేట గ్రామస్థులు మండిపడ్డారు. కుంటిసాకులతో రోడ్డు పనులకు అడ్డు చెప్పొద్దంటూ నెన్నెల రేంజ్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులను గుర్తిం చాలని హౌజింగ్ డీఈ మునీందర్ అన్నారు. గురువారం ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరి శీలించి మాట్లాడుతూ సర్వేను పారదర్శకంగా నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలన్నారు.
డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని ఎంపీడీవో సత్యనారా యణసింగ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేశామన్నారు.
నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సమస్యలను కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, సబ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్తామని కేంద్ర సంఘం సలహాదారు సంద అశోక్ తెలిపారు. గురువారం జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఐటీఐ కార్యాలయంలో చేపట్టిన సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.
రేషన్ డీలర్లు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పాలకులకు ఏళ్ల తరబడి మొర పెట్టుకుంటున్నా మోక్షం లభించడం లేదు. నెల రోజులు శ్రమ పడితే చివరకు మిగిలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సమస్యలు తీరుతాయని గంపెడు ఆశలు పెట్టుకున్న డీలర్లకు నిరాశే ఎదురైంది.
అకాల వర్షాలతో తడిసిన ధాన్యం, పత్తికి మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. నెన్నెల రైతులతో సోమవారం మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ మాట్లాడారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని, పత్తిని పరిశీలించారు.
నస్పూర్లోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం (ఎస్ఎస్ఏ-జెఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష సోమవారం ముగిసింది. ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్ళాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు. ర్యాలీని కలెక్టరేట్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంతో మంచిర్యాల డిపో పరిధిలో రద్దీ పెరిగింది. డిసెంబరు 9, 2023న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలులోకి తీసుకువచ్చింది. నాటి నుంచి జీరో టికెట్తో మహిళలు ప్రయాణించేలా ఆర్టీసీ అధికారులు వెసలుబాటు కల్పించారు.
రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం ఇంతవరకు లబ్ధిదారులకు అందలేదు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ లోపు ఆహార భద్రత కార్డులున్న లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకు జిల్లాలోని ఎంఎల్ఎస్ (మండల లెవల్ స్టాకిస్ట్) పాయింట్ల నుంచి ప్రతీ నెల 25వ తేదీలోపు బియ్యం రేషన్ షాపులకు చేరాల్సి ఉంటుంది.