స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి
ABN , Publish Date - Dec 14 , 2024 | 10:33 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. శనివారం నియోజకవర్గ సంస్ధాగత ఎన్నికల సమావేశంలో మాట్లా డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు.
బెల్లంపల్లి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. శనివారం నియోజకవర్గ సంస్ధాగత ఎన్నికల సమావేశంలో మాట్లా డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొం దన్నారు.
ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీయేనని తెలి పారు. ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ప్రజ లకు తెలియజేయాలని సూచించారు. బూత్ కమిటీలను త్వరగా పూర్తి చేసి మండల కమిటీ ఎన్నికకు సిద్ధంగా ఉండాలన్నారు. మాజీ ఎమ్మె ల్యే శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్, సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్ కృషమ్ణమూర్తి, కోకన్వీనర్ చిలుముల శ్రీకృష్ణదేవరా యలు, సంతోష్, బద్దం లింగారెడ్డి, తిరుపతి, కళ్యాణి, పాల్గొన్నారు.