Home » Mancherial district
మద్యం తాగారని ఆరోపిస్తూ పలువురు ఆర్టీసీ డ్రైవర్లను అధికారులు విధుల్లోకి తీసుకోలేదు. అందుకు నిరసనగా సోమవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవర్లు ధర్నాకు దిగారు.
ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు అయిన వారిలో ఎంతోమంది జైలుకు వెళ్లారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒకరిద్దరు జైలుకు వెళ్లొచ్చి సీఎంలు అయినంత మాత్రాన... మళ్లీ అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటని చెప్పారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుకు కాలం చెల్లిన ఇంజక్షన్ను ఇవ్వడమే కాకుండా, తేదీలను మార్ఫింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వన్యప్రాణుల సంరక్షణకు నిలయమైన కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని తాళ్లపేట రేంజ్ అటవీ ప్రాంతంలో ఒక చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీరుపై తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ తమపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు పోలీసులు.
సింగరేణిలో పెద్ద పులి సంచరిస్తుండటంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
గుడిపేటలో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు కారులో నోట్ల మార్పిడి చేస్తుండగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
గత 20 రోజులుగా మంచి రేవుల ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది.