• Home » Mancherial district

Mancherial district

చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చర్యలు

చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చర్యలు

గూడెం ఎత్తిపోతల పథకం కింద యాసంగి పంట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకొంటున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, చీఫ్‌ ఇంజనీర్‌ బద్రినారాయణ, డీఈ దశరధంలతో కలిసి రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

నియోజకవర్గంలో వంద కోట్లతో అభివృద్ధి పనులు

నియోజకవర్గంలో వంద కోట్లతో అభివృద్ధి పనులు

చెన్నూరు నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేక్‌ వెంకట స్వామి అన్నారు. శనివారం ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు.

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలి

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలి

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్‌డీవో కిషన్‌ సూచించారు. శనివా రం నీల్వాయి, కేతనపల్లి, ముల్కలపేట గ్రామాల్లో జరుగుతున్న నర్సరీ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే హరితహారం కోసం మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

హమాలీల సమ్మెతో నిలిచిన బియ్యం సరఫరా

హమాలీల సమ్మెతో నిలిచిన బియ్యం సరఫరా

హమాలీల సమ్మెతో చౌకధరల దుకాణాలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. సంక్రాంతి పిండి వంటలు చేసుకోవ డానికి ఎక్కువ శాతం రేషన్‌ బియ్యం వినియోగిస్తారు. పండుగ సమీపిస్తున్నా రేషన్‌ షాపుల్లో బియ్యం పంపిణీ జరగడం లేదు.

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

పోలీసులు క్రమశిక్షణ కలిగి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం గుడిపేట 13వ బెటాలియన్‌లో జరిగిన పోలీస్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ (దీక్షాంత్‌పరేడ్‌)కు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ ట్రైనీ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

బాలిక విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే

బాలిక విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే

బాలిక విద్య కోసం కృషి చేసిన తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఫూలే జయంతిలో డీసీపీ భాస్కర్‌, డీఈవో యాదయ్యతో కలిసి పాల్గొ న్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు.

ప్రజల సంక్షేమానికి కృషి

ప్రజల సంక్షేమానికి కృషి

ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, జిల్లా అటవీ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్‌లతో సమావేశం నిర్వ హించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జన్నారం మండలం కవ్వాల్‌ పులుల అభయారణ్యం అభివృద్ధి, వన్య ప్రాణు ల సంరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల రక్షణకు కృషి చేస్తోం దన్నారు.

యాసంగి సాగుకు కడెం ప్రాజెక్టు సిద్ధం

యాసంగి సాగుకు కడెం ప్రాజెక్టు సిద్ధం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి సాగునీరు అందించే కడెం ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయ్యాయి. గత ఏడాది వర్షాకాలంలో భారీగా నీరు చేరడంతో ప్రాజెక్టు ఆనకట్ట దెబ్బతినడంతోపాటు పలు గేట్లు మొరాయించాయి. నీటి లీకేజీ కారణంగా సకాలంలో నీరందక ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఏజెన్సీ భూముల కబ్జా వాస్తవమే...!

ఏజెన్సీ భూముల కబ్జా వాస్తవమే...!

దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో గిరిజన (ఏజెన్సీ) భూములు కబ్జాకు గురైన విషయం వాస్తవమేనని తేలింది. ఈ మేరకు గురువారం గ్రామంలో సర్వే జరిపిన రెవెన్యూ అధికారులు భూములు కబ్జాకు గురైనట్లు నిర్ధా రించారు. ఏజెన్సీ భూములను స్వాధీనం చేసుకున్న కబ్జా దారులు అందులో రైస్‌మిల్లు కూడా ఏర్పాటు చేశారు.

ఏబీ బర్దన్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలి

ఏబీ బర్దన్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలి

కమ్యూనిస్టు సైద్ధాంతిక తత్వవేత్త ఏబీ బర్దన్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో బర్దన్‌ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి