• Home » Mancherial district

Mancherial district

బేరసారాల బదిలీలు....!

బేరసారాల బదిలీలు....!

నేను.. ఫలానా జిల్లాలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. నేను ఈ జిల్లాకు మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడ పనిచేసే వారు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించండి... అంటూ కొందరు ఉపాధ్యాయులు వాట్సాప్‌లో పోస్టులు పెడుతున్నారు. జీవో 317తో నష్టపోయిన ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వడంతో ఆశావహుల్లో ఆనందం నెలకొంది.

ప్రశాంతంగా గ్రూప్‌-2 పరీక్షలు

ప్రశాంతంగా గ్రూప్‌-2 పరీక్షలు

జిల్లాలో ఆదివారం ప్రారంభమైన గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఆదివారం నాటి పరీక్షలకు 14968 మంది అభ్యర్థులకుగాను ఉదయం 7446 మంది, మధ్యాహ్నం 7363 మంది అభ్యర్థులు మాత్రమే హాజరుకాగా, 83 మంది గైర్హాజరయ్యారు.

ఇళ్లను పంచే శక్తిలేని నాయకులు మీరు

ఇళ్లను పంచే శక్తిలేని నాయకులు మీరు

మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన 400 డబుల్‌ బెడ్రూం ఇళ్లను పంచే శక్తిలేని నీవు అభివృద్ధిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావును ఉద్దేశించి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివా రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపో వద్దని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. కిష్టంపేట, కత్తెరసాల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్‌ చెల్లిస్తుందని పేర్కొన్నారు.

వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ

వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ

పాత మంచిర్యాల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం మహా మండల పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు నరహరి శర్మ ఆధ్వ ర్యంలో అయ్యప్ప అభిషేకంతోపాటు పడిపూజ నిర్వహించారు. అనం తరం అయ్యప్ప స్వాములు గ్రామంలో నగర సంకీర్తన చేశారు.

ఊపందుకున్నశ్మశాన వాటిక  పనులు

ఊపందుకున్నశ్మశాన వాటిక పనులు

జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన హిందూ శ్మశాన వాటిక పనులు వేగం పుంజుకున్నాయి. గోదావరి సమీపంలోని భూధాన్‌ యజ్ఞ బోర్డు భూముల్లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.4 కోట్ల అంచనాతో నిర్మాణం చేపట్టగా, అక్టోబర్‌ 3న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు శంకుస్థాపన చేశారు.

 నియోజకవర్గంలో కానరాని అభివృద్ధి

నియోజకవర్గంలో కానరాని అభివృద్ధి

మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి అగుపించడం లేదని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శనివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.164 కోట్లతో నిర్మించ తలపెట్టిన గోదావరిపై అంతర్గాం వంతెన ఊసే లేదని, నిర్మించిన ఇంటి గ్రేటెడ్‌ మార్కెట్‌, ఐబీ గెస్ట్‌హౌజ్‌ను లేకుండా చేశాడన్నారు.

నాణ్యమైన భోజనం అందించేందుకే కామన్‌ మెనూ

నాణ్యమైన భోజనం అందించేందుకే కామన్‌ మెనూ

గురుకులాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం మెస్‌ చార్జీలను పెంచి కామన్‌ మెనూను ప్రారంభించిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ప్రభు త్వం ప్రవేశపెట్టిన కామన్‌ డైట్‌ మెనూను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి ప్రారంభించారు.

లోక్‌అదాలత్‌లో 5,500 కేసుల పరిష్కారం

లోక్‌అదాలత్‌లో 5,500 కేసుల పరిష్కారం

రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ జిల్లా వ్యాప్తంగా లోక్‌ అదాలత్‌ నిర్వహించడం జరిగిందని, ఏడు బెంచీలను ఏర్పాటు చేశామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో  సత్తాచాటాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు. శనివారం నియోజకవర్గ సంస్ధాగత ఎన్నికల సమావేశంలో మాట్లా డారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి