Home » Madanapalle
మదనపల్లెలో జరిగిన కిడ్నీ ఆపరేషన్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కిడ్నీ డోనర్ నుంచి రిసీవర్ వరకూ కొందరు దళారులు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నారు. డయాలసిస్ కేంద్రాల్లో పనిచేస్తున్న టెక్నీషియన్, సిబ్బంది ద్వారా కొన్ని ఆసుపత్రులు, మరికొందరు వైద్యులు సంయుక్తంగా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలా పాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధమున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మురళిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుపతి పద్మావతిపురంలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. రెవెన్యూ ఫైళ్ల దహనంపై దాదాపు ఆరు గంటల పాటు మురళిని సీఐడీ అధికారులు విచారించారు.
చిత్తూరు జిల్లాలో మదనపల్లె చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడి భూములు విలువైనవే కాదు.. ఇక్కడ భూకబ్జాలు, ఆక్రమణలు, ఫోర్జరీ రికార్డులతో స్వాధీనం చేసుకునే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తులు ఎక్కువగా ఉన్నారు. కీలకమైన రెవెన్యూ సిబ్బంది, అధికారులే వీరికి ప్రత్యక్ష, పరోక్షకారులు. ఈ క్రమంలో అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో వీరంతా కలసి పనిచేసినవారే.
మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మొక్కలు పెంచుదాం.. ఆరోగ్యాన్ని పంచుదాం, అమ్మ పేరుతో ఒక మొక్క, ఇంటింటా చెట్టు ఊరూరా వనం' అనే నినాదాల పేరుతో ప్రభుత్వాలు మొక్కలు పెంచాలని చెబుతున్నాయి. అడవుల సంరక్షణ, మొక్కల పరిరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామం, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. పైగా వాల్టా చట్టాన్ని కూడా అమలు చేస్తోంది.
మదనపల్లె బీకే పల్లె వద్ద మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్వేలో గుర్తించిన అనంతరం ఫెన్సింగ్ తొలగించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
Annamayya District: ప్రేమికుల దినోత్సవం రోజు ఏపీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే ఆగ్రహంతో యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
న్యాయాధికారులు ఇరుపక్షాల వాదనలు విని తీర్పు ఇచ్చేవారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకటనారాయణ భట్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో ప్రధాన నిందితుడు, సీనియర్ అసిస్టెంట్ గోరంట్ల గౌతమ్తేజ్ను
మదనపల్లిలో మరో అవినీతి తిమింగలం బయటపడింది. మాజీ డిప్యూటీ కలెక్టర్ ఎంఎస్ మురళి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు్న్నాయి. తాజాగా ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టి పెట్టడంతో పలు విషయాలు బహిర్గతమయ్యాయి. ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. కిలోల కొద్దీ బంగారు నగలు.. ఇక బ్యాంకు అకౌంట్లలో కోట్లలోనే బ్యాంకు బ్యాలెన్సులు.. ఇదంతా ఓ మాజీ డిప్యూటీ కలెక్టర్ అవినీతి భాగోతం. అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు ఈ భారీ అవినీతి తిమింగలం చిక్కింది.