Home » Liquor rates
రాష్ట్రంలో నకిలీ మద్యం కలకలం రేపుతోంది. ఇటీవల నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో పలుచోట్ల నకిలీ మద్యం ముఠాలు పట్టుబడ్డాయి. నాసిరకం మద్యాన్ని ఖరీదైన సీసాల్లో పోసి అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్న విషయం వెలుగు చూసింది.
సొంతలాభం కొంత మానుకుని జనం బాగుకోసం పాటుపడాలని గురజాడ వారు చెప్పారు కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఇందుకు పూర్తిగా రివర్స్ అధికారంలో ఉండగా. జనం సొమ్మును సొంతలాభానికి వాడుకున్నారు.
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా సాగిన మద్యం వ్యవహారాలను కూటమి ప్రభుత్వం కట్టడి చేస్తోంది. ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్మేవారిపై గట్టి నిఘా పెట్టింది.
మద్యం కుంభకోణం ప్రణాళికను రచించి, అమలు చేయడంలో వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిది కీలక పాత్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది. ప్రధాన వ్యూహకర్త ఆయనేనని తెలిపింది.
మద్యం కేసులో 7మంది వైసీపీ నేతల రిమాండ్ ఈ నెల 17 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. కోర్టు హాలులో అనవసరంగా గుమికూడితే తలుపులు మూసే ప్రమాదం ఉందని న్యాయాధికారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ లిక్కర్ స్కాంలో తాడేపల్లి బిగ్బాస్ కీలక సూత్రధారి అని కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. దర్యాప్తులో జగన్కు అనుయాయుల పక్కన ఉన్న ఆధారాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిపారు.
మూడు వేల కోట్ల మద్యం స్కాంలో సిట్ విచారణలో కసిరెడ్డి, మిథున్ రెడ్డి లు అబద్ధాలూ, తప్పుదోవ జవాబులూ ఇచ్చినట్టు తెలుస్తోంది. దర్యాప్తును మరింత లోతుగా చేపట్టి ప్రధాన లబ్ధిదారులపై ఉచ్చు బిగిస్తున్న సిట్ అధికారులు ఈడీతో కలసి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు.
వైఎస్ జగన్ హయాంలో జరిగిన 3200 కోట్ల మద్యం కుంభకోణంలో సిట్ కీలక ఆధారాలు వెలికితీసింది. హవాలా, బులియన్, రియల్టీ వ్యాపారాల ద్వారా డబ్బు ప్రవాహాన్ని ట్రేస్ చేస్తూ ‘అంతిమ లబ్ధిదారుల’ను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది.
BJP MP CM Ramesh: జగన్ అండ్ కో దోచుకున్న ప్రజల సొమ్మును కక్కిస్తామని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హెచ్చరించారు. చాలామందిని భయపెట్టి డిస్టిలరీలను జగన్ సొంతం చేసుకున్నారని.. ఆయన బెదిరింపులకు పాల్పడి నాసిరకం మద్యం అమ్మారని ఎంపీ సీఎం రమేశ్ ఆరోపించారు.
ఏపీ సరిహద్దులోని కర్ణాటకలో మద్యం అమ్మకాలు తగ్గడంతో, కర్ణాటక మద్యం ప్రియులు ఏపీ బ్రాండ్లు తాగుతూ మద్యం షాపుల దగ్గరకు వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మద్యం పాలసీ మార్పుల ద్వారా మంచి, తక్కువ ధరల బ్రాండ్లు అందుబాటులో ఉంచినట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది.