• Home » KonaSeema

KonaSeema

 గ్రీవెన్స్‌ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

గ్రీవెన్స్‌ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

సమస్యలపై అందించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీలతో పాటు స్వర్ణాంధ్ర విజన్‌, రెవెన్యూ సమస్యలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

ఏఎంసీ చైర్మన్లకు రిజర్వేషన్లు ఖరారు

ఏఎంసీ చైర్మన్లకు రిజర్వేషన్లు ఖరారు

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోని (ఏఎంసీ) చైర్మన్‌ నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ తప్పనిసరి చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 9 వరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి.

అంతర్వేది కల్యాణోత్సవాలపై సమీక్ష

అంతర్వేది కల్యాణోత్సవాలపై సమీక్ష

ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు జరిగే అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

 అత్యాధునిక సౌకర్యాలతో రైతు బజార్‌

అత్యాధునిక సౌకర్యాలతో రైతు బజార్‌

అమలాపురం రైతు బజార్‌ ఈ నెల 25న పునఃప్రారంభించనున్న దృష్ట్యా రైతుబజార్‌లోని దుకాణ సముదాయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ నిషాంతితో కలిసి కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ గురువారం పరిశీలించారు. ప్రస్తుతం 1.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రైతుబజార్‌ ప్రాంగణ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి ఆయా శాఖల సిబ్బందికి పలు సూచనలు చేశారు.

తువ్వ మట్టి లారీ సీజ్‌

తువ్వ మట్టి లారీ సీజ్‌

గంటిపెదపూడి వద్ద అను మతులు లేకుండా తువ్వ మట్టిని తరలిస్తున్న లారీని సీజ్‌ చేసినట్లు తహ శీల్దార్‌ పి.శ్రీపల్లవి తెలిపారు. మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన తువ్వమట్టినీ వదల్లేదు! వార్తకు స్పందించిన అఽధికారులు తనిఖీలు నిర్వహించారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అడబాల

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అడబాల

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అడబాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. మలికిపురం మండలం తూర్పు పాలెం గ్రామానికి చెందిన ఆయన 1994లో బీజేపీలో చేరారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనేక పదవులు నిర్వర్తించారు.

 గణతంత్ర వేడుకల విజయవంతానికి సన్నద్ధం కావాలి

గణతంత్ర వేడుకల విజయవంతానికి సన్నద్ధం కావాలి

76వ గణతంత్ర వేడుకలను అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ నెల 26న ఘనంగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధం కావాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి అధికారులను ఆదేశించారు. ప్రతీ ప్రభుత్వ శాఖలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించే విధంగా జిల్లాస్థాయి అధికారులు జాబితాలను సిద్ధం చేయాలన్నారు.

రేపటి నుంచి కోనసీమ క్రీడోత్సవాలు

రేపటి నుంచి కోనసీమ క్రీడోత్సవాలు

కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ప్రత్యేక చొరవతో కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీంబాషా తెలిపారు. కోనసీమ క్రీడోత్సవాల్లో భాగంగా జిల్లాలోని 22 మండలాల పరిధిలోని 2600 మంది పాఠశాలల విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారన్నారు.

అర్జీల పరిష్కారంలో బాధ్యతారాహిత్యం తగదు

అర్జీల పరిష్కారంలో బాధ్యతారాహిత్యం తగదు

అర్జీల పరిష్కారంలో బాధ్యతా రాహిత్యానికి తావు లేకుండా ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సూచించారు. పరిష్కార సరళిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు.

 2 వరకు కుష్టు వ్యాధి బాధితుల గుర్తింపు ప్రక్రియ

2 వరకు కుష్టు వ్యాధి బాధితుల గుర్తింపు ప్రక్రియ

జిల్లాలో ఫిబ్రవరి 2 వరకు కుష్టు బాధితులను గుర్తించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో ఈ నెల 20 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమం వాల్‌ పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి