Home » KonaSeema
ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన జీవో నంబరు 7 ప్రకారమే ఆక్వా చెరువుల అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సూచించారు. తీర ప్రాంతం వెంబడి ఆక్వా జోన్, ఆక్వాయేతర జోన్లలో ఎంతమేర విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నవి సర్వే ఆధారంగా ఖచ్చితత్వంతో గుర్తించి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జియో కోఆర్డినేట్స్ మ్యాప్లతో సహా బృందాలు సర్వే నిర్వహించాలన్నారు.
మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో పవిత్రోత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయదుర్గా అమ్మవారికి, శ్రీదేవి , భూదేవి సమేత విజయవేంకటేశ్వరస్వామికి వైఖానస పండితులు పూజలు నిర్వహించారు.
గతంలో ఎన్నడూలేని విధంగా మళ్లీ మరోసారి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1 బుధవారం అయినప్పటికీ నూతన సంవత్సరంలో ఆనందోత్సాహాలతో పెన్షన్దారులు గడపాలన్న లక్ష్యంతో ఒకరోజు ముందుగానే డిసెంబరు 31న పెన్షన్ల పంపిణీకి ఆదేశాలు జారీ చేసినట్టు డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకరప్రసాద్ తెలిపారు.
సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల తీర్థాన్ని సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు సూచించారు. అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి శ్యామలాంబ సమేత శ్రీ చెన్నమల్లేశ్వరస్వామి ఆలయంలో 11 ప్రభల ఉత్సవ కమిటీ సమావేశం శ్రీపాద వెంకటరమణ అధ్యక్షతన బుధవారం జరిగింది.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు త్రిసభ్య కమిటీలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కూటమి నాయకులలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 166 వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉండటంతో వీటిలో ముగ్గురు సభ్యులను నియమించి పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పాలక వర్గాలను దక్కించుకోవడం కోసం నియోజకవర్గ శాసన సభ్యుల వద్దకు ఆశావహులు పరుగులు తీస్తున్నారు.
విద్యార్థి దశ నుంచి పరిశోధనా శక్తిని పెంపొందించడంతో పాటు వారిని ప్రోత్సహించే లక్ష్యంతో త్వరలోనే జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. ఈ నెల 29వ తేదీలోగా మండలస్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు పూర్తి చేయాలని బుధవారం ఆదేశించారు.
మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. ఇం దుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మున్సిపాలిటీల నిధులను సొంత ఖర్చు లకే వినియోగించుకునే వెసులుబాటును కూట మి ప్రభుత్వం కల్పించింది.
కాకినాడ జిల్లా కరప మండలం కొరి పల్లి అద్దె గోదాములో రేషన్ బియ్యం మా యంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అన్ని ప్రైవేటు గోదాముల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యంపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదే శించింది. కాకినాడ జిల్లాలో ఎనిమిది గోదా ములను పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసు కుని రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నిల్వ చేసింది.
కాకినాడ సముద్రంలో లంగరు వేసు కుని ఉన్న స్టెల్లా ఎల్ పనామా నౌకకు అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి. వాతావర ణం అనుకూలించకపోవడం వల్ల నౌకలోని రేషన్ బియ్యం ఒడ్డుకు చేర్చలేకపోతున్నారు. దీంతో నౌక గమ్యం చేరే పరిస్థితి చేరడం లేదు. మంగళవారం కూడా తుఫాను ప్రభా వంతో బియ్యాన్ని తీసుకురాలేకపోయారు. స్టెల్లాఎల్ పనామా నౌక కాకినాడ సముద్ర తీరానికి వచ్చి దాదాపు నెల రోజులవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్న ఉచిత ఇసుక పథకం లక్ష్యం క్షేత్రస్థాయిలో నీరుగారిపోతోంది. ఇప్పటికే ఆత్రేయపురం మండలంలో అంకంపాలెం, నార్కెడిమిల్లి, పులిదిండి వద్దిపర్రు, ఆత్రేయపురం ఇసుక ర్యాంపులను ప్రారంభించడమే కాకుండా మరో మూడు ర్యాంపులను అధికారులు మంజూరు చేయనున్నారు.