Home » KonaSeema
పండగంటే ఊరంతా సందడి వాతావరణం. పండుగ శుభాకాంక్షల ఫ్లెక్సీలతో గ్రామమంతా నిండిపోతుంది. కానీ అక్కడి గ్రామ ప్రజలు మాత్రం ఈ పండుగకు ఊరి సమస్యను అందరికీ తెలిసేలా ఫ్లెక్సీ ఏర్పాటుచేసి.. తమ సమస్యకు పరిష్కారం కావాలంటూ గళమెత్తారు.
ఆత్రేయపురం వద్ద గోదావరి ప్రధాన కాలువలో మూడ్రోజులుగా వాటర్ స్పోర్ట్స్ ఉత్సాహంగా సాగుతున్నాయి. మెుత్తం 11 జిల్లాలకు చెందిన 180 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దగ్గరుండి మరీ పడవ పోటీలను నిర్వహించారు.
అమలాపురం టౌన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి వరకు టీవీ చూసి ఇంట్లో ఆదమరిచి నిద్రిస్తుండగా దొంగలు పడి రూ.10.50లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారు. సమాచారం తెలుసుకున్న అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు సిబ్బందితో సంఘటనా
ఆత్రేయపురం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన కెనాల్లో సర్ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా కేరళ తరహాలో డ్రాగన్ పోటీలు రసవత్తరంగా సాగాయి. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ట్రోఫి పోటీలు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆత్రేయపురం ప్రధాన కాలువలో రెండో రోజు ఆదివారం నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. కేరళను తలపించేలా డ్రాగన్ పడవ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి 11 టీమ్లు 121 మంది పడవ పోటీలలో
అంబాజీపేట, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రపంచం నలుమూలలకు విస్తరించిన జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రభల ఉత్సవాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవ్ విభాగంలోని వెబ్సైటులో చోటు కల్పించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం గ్రామానికి చెందిన శివకేశవయూత్ సభ్యులు 450 ఏళ్లచరిత్ర కలిగిన జగ్గన్నతోట ఏకా
సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థాలలో అల్లర్లకు పాల్పడితే కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తామని కొత్తపేట డీఎస్పీ వై.గోవిందరావు హెచ్చ రించారు. ప్రభల తీర్థం సందర్భంగా స్థానిక పెద్దవీధి లోని కోప్పా మర్చంట్స్ భవనంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సీఐ రుద్రరాజు భీమరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
సంక్రాంతి పర్వదినాల ముసుగులో జూద క్రీడల నిర్వహణకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. సాక్షాత్తూ అధికార తెలుగుదేశం పార్టీ కూటమికి చెందిన ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ప్రమేయంతో కోనసీమ జిల్లాలో కోడి పందాలు, గుండాటలు, పేకాటలు వంటివి నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సంక్రాంతి వస్తుందంటే హైదరాబాద్ నుంచి కోనసీమకు వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రైవేటు ట్రావెల్స్ పోటీపడి మరీ బస్సులను ఏర్పాటు చేస్తాయి. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీతో పాటు మన ప్రైవేటు ట్రావెల్ బస్సుల టిక్కెట్ ధరలను ఆన్లైన్లో చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జన్మభూమి కార్యక్రమాన్ని పునఃప్రారంభించనున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ వెల్లడించారు. ఈలోపుగానే రెవెన్యూ సదస్సుల్లో అందిన ఫిర్యాదులను రీఓపెన్కు ఆస్కారం లేకుండా పూర్తి నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్లోని గోదావరి భవన్లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.