Home » Komati Reddy Venkat Reddy
రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన పెండింగ్ అంశాలను పూర్తిచేసి, పనులను ప్రారంభించేలా చూస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
తెలంగాణకు మంజూరు చేసిన రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనుల్లో వేగం పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కానున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకెళ్తున్నదని జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
వరంగల్ జిల్లా మామునూరులో విమానాశ్రయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బీఆర్ఎస్ నేతలకు మానవత్వం లేదని.. ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నిరంతరం అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. తూప్రాన్ రైలు ప్రమాదంలో స్కూల్ విద్యార్థులు చనిపోతే కేసీఆర్ కనీసం వెళ్లి పరమర్శించలేదని విమర్శించారు. మీరు చేయని పనులు మేము చేస్తున్నామని.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరం కలిసికట్టుగా ఉండాలన్నారు.
Komatireddy: సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజలింగముర్తిని గండ్ర వెంకట రమణా రెడ్డి హత్య చేయించారని ఆరోపించారు.
Komatireddy: కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్కు అన్ని పండుగలు సమానమే అని స్పష్టం చేశారు. హిందు, ముస్లిం, క్రిస్టియన్లను అందరిని కలుపుకుపోయే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
కులగణనపై రాద్ధాంతం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు ఎమ్మెల్సీ కవితను చూసి నేర్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆ ముగ్గురూ కులగణనలో పాల్గొనలేదని, కవిత ఒక్కరే పాల్గొన్నారని చెప్పారు.
అటవీ ప్రాంతాల్లోని రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ ప్రాంతాల్లోని రోడ్ల మరమ్మ తులను చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో పాల్గొన్నారు.