Share News

Komatireddy Venkata Reddy: కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పుణ్యస్నానం

ABN , Publish Date - Feb 11 , 2025 | 04:22 AM

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో పాల్గొన్నారు.

Komatireddy Venkata Reddy: కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పుణ్యస్నానం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో పాల్గొన్నారు. సోమవారం తెల్లవారుజామున 5.10 గంటలకు సంగం ఘాట్‌ దగ్గర పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే ఉన్న బడే హనుమాన్‌జీ దేవాలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించారు. అనంతరం పండితులు మంత్రికి వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు

Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి

For Telangana News And Telugu News

Updated Date - Feb 11 , 2025 | 04:22 AM