Home » Komati Reddy Venkat Reddy
‘‘వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి సమస్యలు లేకుండా చూడాలి. ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని, రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Minister Komatireddy Venkatareddy: ఎస్ఎల్బీసీ పనుల ప్రాజెక్ట్ ఆలస్యంపై అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. SLBC, బ్రాహ్మణవెళ్లాంల ప్రాజెక్ట్లు తనకు తొలి ప్రాధాన్యమన్నారు. SLBC ఒక వరల్డ్ వండర్.. SLBC పూర్తయితే.. ప్రపంచమంతా వచ్చి చూస్తుందని అన్నారు.
గత ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పేందుకు కూడా కాంగ్రెస్ నేతలకు నోరు రావడంలేదని, ఉత్తర రీజినల్ రింగ్రోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు.
‘నువ్వేం భయపడకు.. నేనున్నాగా.. నువ్వు బాగా చదువుకో.. అండగా నేనుంటా’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ పేద విద్యార్థినికి భరోసానిచ్చారు. ఆమెకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు.
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్రావుకు తన మామ కేసీఆర్, బామ్మర్ది కేటీఆర్పై కోపం ఉందని, అందుకే ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) లీజు టెండర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారని రాష్ట్ర ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
CM Revanth Reddy: ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కన్హా శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్కు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ను అక్కడి విద్యార్థులు ప్రదర్శించడం చూసి ముఖ్యమంత్రి వారిని అభినందించారు.
ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని.. అసెంబ్లీలో ఈమేరకు తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు తేల్చిచెప్పారు.
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని నవజాత శిశువు సంరక్షణ కేంద్రానికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయం కలిగిన వైద్య పరికరాలను అందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
పుష్ప 2 చిత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ను.. ఆ చిత్ర నిర్మాత యెర్నేనీ నవీన్తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు.