Home » Kolkata
కోల్కతాలో(Kolkata) ఘోరం జరిగింది. ఆదివారం అర్థరాత్రి నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గార్డెన్ రీచ్ ప్రాంతంలోని హజారీ మొల్లా బగన్లో అర్ధరాత్రి ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.
దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన సందేశ్ఖలీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న షాజహాన్ షేక్ సోదరుడు ఆలంగీర్ను సీబీఐ అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ఇద్దరినీ అరెస్టు చేసింది.
దేశంలోనే నీటి అడుగున నడిచే తొలి మెట్రో మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. కోల్కతా ( Kolkata ) లోని ఎస్ప్లానేడ్ నుంచి హౌరా మైదాన్ వరకు దేశంలోనే తొలి అండర్ రివర్ మెట్రో సర్వీసు ప్రారంభమైంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి కేసులో నిందితుడు షేక్ షాజహాన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రం 4.30 గంటల కల్లా అప్పగించాలని పశ్చిమబెంగాల్ సీఐడీని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్ సీఐడీకి కోర్టు ధిక్కార నోటీసులు కూడా జారీ చేసింది.
2024 లోక్సభ ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ దూకుడు పెంచారు. రానున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మోదీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయలతో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
బెంగాల్ టీచర్స్ కుంభకోణంతో సహా పలు అంశాల్లో కీలకమైన తీర్పులు చెప్పిన కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ మంగళవారంనాడు తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 7వ తేదీన బీజేపీలోకి చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.
ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన సందేశ్ఖాలి ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ కోల్కత్తా హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. దాడి కేసు నిందితుడుషేక్ షాజహాన్ ను మంగళవారం మధ్యాహ్నం 4.30 గంటల కల్లా సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.
కోల్ కతా డమ్ డమ్ ఏరియాలో సంహతి పాల్ అనే మేకప్ ఆర్టిస్ట్ ఉంటోంది. ఆమెకు సార్ధక్ దాస్ అనే ఫొటోగ్రాఫర్తో వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరి మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రోజున సార్ధక్ దాస్పై సంహతి పాల్ కత్తితో విచక్షణరహితంగా దాడి చేసింది. దాంతో అతను కుప్పకూలిపోయాడు.
పశ్చిమ్ బెంగాల్లోని సందేశ్ఖలీలో మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ అరెస్టుపై ఎటువంటి స్టే లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది.
ఆందోళనలతో అట్టుడుకుతున్న నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్కాళి గ్రామంలో పర్యటించేందుకు పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారికి కోల్కతా హైకోర్టు సోమవారంనాడు అనుమతి ఇచ్చింది. అయితే, రెచ్చగొట్టే ప్రసంగాలేవీ చేయవద్దని హెచ్చరించింది.