Home » KL Rahul
ఇంగ్లండ్తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో 28 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 190 పరుగుల భారీ అధిక్యం సాధించినప్పటికీ ఓడిపోవడం గమనార్హం.
ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చెలరేగారు. భారీ హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన వీరిద్దరు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో మొదటి రెండు రోజులు భారత్ ఆధీక్యం కొనసాగింది. తొలి రోజు ఇంగ్లండ్ను భారత బౌలర్లు 246 పరుగులకే కట్టడి చేశారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది.
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు భారీ అధిక్యం దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్పై భారత జట్టు 63 పరుగుల అధిక్యంలో నిలిచింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. లంచ్ విరామ సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(55), శ్రేయాస్ అయ్యర్ (34) ఉన్నారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 25 నుంచి ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో సత్తా చాటడమే లక్ష్యంగా టీమిండియా ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.
Sunil Gavaskar: టీ20 ప్రపంచకప్నకు మరో 6 నెలల సమయం కూడా లేదు. దీంతో జట్లన్నీ ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రపంచకప్నకు తమ జట్లను సిద్దం చేసుకోవడంపై సెలెక్టర్లు కూడా దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రపంచకప్నకు టీమిండియా ఎలాంటి జట్టుతో వెళ్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
అఫ్ఘానిస్థాన్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు సెలెక్టర్లు ఆదివారం భారత జట్టును ప్రకటించారు. 16 మందితో కూడిన ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండడం గమనార్హం. ఈ జట్టుకు కెప్టెన్గా కూడా రోహిత్ శర్మనే వ్యవహరించనున్నాడు.
KL Rahul: మిగతా భారత బ్యాటర్లు విఫలమైన చోట టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చి రాహుల్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు.
KL Rahul: టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్ మైదానంలో రెండు సెంచరీలు చేసిన ఏకైక పర్యాటక జట్టు ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. 2021-22లో దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించినప్పుడు కూడా సెంచూరియన్ టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ (123) బాదాడు.