Home » Kejriwal
మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో పైర్ అయ్యారు. కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు స్వాగతిస్తున్నానన్నారు. తాను అప్రూవర్ గా మారి సీఎంకు శిక్ష పడేలా చేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీ భయపడుతున్నారని ఆప్ నేతలు ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ను అక్రమంగా అరెస్ట్ చేశారని విరుచుకుపడ్డారు. ఆప్ ఏర్పాటు చేసి 12 ఏళ్లు అవుతోంది. ప్రాంతీయ పార్టీ నుంచి గత ఏడాది జాతీయ పార్టీగా గుర్తింపు వచ్చింది. ఇంతలో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి, పార్టీని భూ స్థాపితం చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు.
లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) అరెస్టుపై జర్మనీ చేసిన కామెంట్లను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు లేఖ రాశారు. ఆయన రాసిన సందేశాన్ని భార్య సునీతా కేజ్రీవాల్ చదవుతూ వీడియో రిలీజ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన భార్య మొదటిసారి వీడియో రిలీజ్ చేశారు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Kejriwa) అరెస్టును బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుని అన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
దిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలును ఉపసంహరించుకున్నారు. మనీలాండరింగ్ విచారణకు సంబంధించి కేజ్రీవాల్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ప్రత్యేక సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.
దిల్లీ మద్యం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) అరెస్టు అవడంతో దేశ రాజధానిలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం దిల్లీ అసెంబ్లీ విడుదల చేసిన బులెటిన్లో సభను రద్దు చేయాలని స్పీకర్ ఆదేశించారు.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. తన అరెస్ట్ చట్టవిరుద్దమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారణ నిర్వహించింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు సుప్రీం ధర్మాసనం జత చేసింది.
అవినీతికి వ్యతిరేకంగా.. సుపరిపాలన అందిచడమే లక్ష్యంగా.. అన్నాహజారే ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ. అతి తక్కువ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దేశం మొత్తం పార్టీని విస్తరించేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. నేటి ఉదయం మరోసారి వైద్యపరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు. స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు.