Home » Kalvakuntla Chandrashekar Rao
మాజీ సీఎం కేసీఆర్పై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్ని గజగజ వణికించానని, తన తలకాయను కేసీఆర్ ఆరు ముక్కలు చేస్తానని గతంలో అన్నారని ఆరోపించారు. ఆయన సంగతి తేల్చేందుకు ఫామ్హౌస్కు వస్తానని తాను చెప్పానని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేస్తోందని స్పష్టం చేశారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా, వద్దా అని ప్రశ్నించారు.
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేపు విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. నందినగర్లోని కేసీఆర్ నివాస సిబ్బందికి నోటీసులు అందజేసింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ను ప్రశ్నించనున్నట్లు సిట్ అధికారులు తెలిపారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మరోసారి ఔదార్యాన్ని చాటారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు , ఉద్యమకారుడు, ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి కేసీఆర్ అండగా నిలిచారు.
కాంగ్రెస్ సర్కార్ బస్తీ దవాఖానాలను కూడా నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కిట్ పథకాన్ని కూడా ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతులను రాచి రంపాన పెడుతోందని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచనే చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. పేదలందరికీ తమ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చామని స్పష్టం చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
కేసీఆర్ సభల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇచ్చారా..? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సచివాలయానికి వెళ్తే గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్రెడ్డి.
మాజీమంత్రి కేటీఆర్కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.హైడ్రాని భూతంలా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.