Home » Jubilee Hills By-Election
రాష్ట్రంలో ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. నామినేషన్ల పర్వం ముగిసి వారం రోజులు గడిచినా.. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నా.. ఓటర్ల మనసులో ఏముందన్న విషయంపై స్పష్టత రాని పరిస్థితి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముషీరాబాద్కు చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేసేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
పోలింగ్ రోజు కేంద్రాల్లో జరిగే విషయాలను పరిశీలించి సాధారణ పరిశీలకులకు నివేదిక సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూక్ష్మ పరిశీలకులకు సూచించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. ఇప్పుడు ప్రచార పర్వం ఊపందుకుంది. నియోజకవర్గ పరిధిలో అధికార బీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలని ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. దేశం సురక్షితంగానూ, సుభిక్షంగానూ ఉండాలంటే మోదీ ప్రధానిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మంగళవారం సాయంత్రం అసెంబ్లీ సెగ్మెంట్లో మహాపాదయాత్ర చేపట్టింది. పార్టీ ముఖ్యనేతలు వివిధ డివిజన్లలో పర్యటించి ఓటర్లను నేరుగా కలిశారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ పరిశ్రమకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సినీ కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాలలు నిర్మిస్తానని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులకి నవీన్ యాదవ్ స్ట్రాంగ్ సవాల్ విసిరారు.
నామినేషన్ వేసిన నాటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు అభ్యర్థులు ఇతర వ్యక్తులు, సంస్థలకు రూ.10 వేలకు మించి నగదు లావాదేవీలు జరపవద్దని, చెక్కుల రూపంలో డబ్బుల బదిలీ ఉండాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీవ్కుమార్లాల్, సహాయ వ్యయ పరిశీలకులు రామకృష్ణ సూచించారు.
జూబ్లీహిల్స్లో బీజేపీ ఇవాళ యూపీ తరహా వినూత్న ప్రచారం నిర్వహించబోతోంది. ఈ ఒకే రోజు 52 ప్రాంతాల్లో ప్రచారం చేస్తారు. సాయంత్రం గం. 4 నుంచి, రాత్రి గం. 9 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. నియోజకవర్గాన్ని 78 శక్తి కేంద్రాలుగా విభజించుకొని..