Home » Jagan
రాజధాని అమరావతిపై కుల ముద్రలు వేసి, మహిళలను అవమానిస్తారా..? ఇక్కడ వెలసిల్లిన బౌద్దాన్నీ అవహేళన చేస్తారా..?’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
మీడియా విశ్లేషణల పేరుతో రాజధాని అమరావతి మహిళలపై దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టుదాటి ప్రవర్తించారని..
ప్రతిపక్షంలో ఉండగా అదానీ, షిర్డీసాయి విద్యుత్తు స్మార్ట్ మీటర్ల బిగింపు వద్దని చెప్పిన కూటమి.. ఇప్పుడు అవే విధానాలను అమలు చేస్తోంది. స్మార్ట్ మీటర్ల బిగింపు నుంచి వ్యవసాయ విద్యు త్తు కనెక్షన్లకు మినహాయింపు ఇచ్చినా.. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు బిగిస్తున్నారు.
రాజధాని అమరావతిపై జగన్ అండ్ బ్యాచ్ మరోసారి విషం చిమ్మింది. ఇక్కడి మహిళలను తీవ్రంగా కించపరచడమే లక్ష్యంగా బరితెగించింది. అమరావతి వేశ్యల రాజధాని అంటూ రోత చానల్లో జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు శనివారం ఉదయం లైవ్ డిబేట్లో నోరుపారేసుకున్నారు.
‘మంచి ప్రభుత్వం’ అంటే ఏమిటి? లెక్కా పక్కా లేకుండా ప్రజాధనాన్ని అనాలోచితంగా ఖర్చు చేసేయడమేనా? కోట్లు పంచిపెట్టి మరీ... తిట్టించుకోవడం ఈ ప్రభుత్వానికి అవసరమా? రేషన్ సరుకుల పంపిణీ వాహనాల (ఎండీయూ) విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలివి!
గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇసుక కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నేతలకు కాసులు కురిపించే వనరుగా మారి.. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం ఇసుకతో పాటు మట్టి, బిల్డింగ్ మెటల్, రోడ్ మెటల్, ఇతర సూక్ష్మ ఖనిజాలు సైతం బంగారమైపోయాయి.
‘‘పార్టీ వేరు, పత్రిక వేరూ కాదు! అందరం కలిసి పని చేయాలి. ప్రభుత్వం గురించి ఏ చిన్న సమాచారం వచ్చినా మన మీడియా ప్రతినిధులు పార్టీ నేతలకు చెప్పాలి.
Gowru Charitha Reddy: కుంభకోణాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికే వైసీపీ వెన్నుపోటు ధర్నా డ్రామాలు ఆడుతోందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు. అసలైన వెన్ను పోటు దారుడు జగన్ రెడ్డి అని.. వెన్నుపోటు అంటూ ధర్నాలు చేయడం దొంగే దొంగ అన్నట్లు ఉందని, గొడ్డలి పోటు దినం కూడా జరుపుకోవాలని ఆమె హితవు పలికారు.
గంజాయి వ్యాపారులకు మద్దతు ఇవ్వడం జగన్ విధానం అంటూ టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ను గంజాయి మాఫియాకు గౌరవాధ్యక్షుడిగా నియమించొచ్చని ఎద్దేవా చేశారు.
తెనాలిలో జగన్ పర్యటన సందర్భంగా దళిత సంఘాలు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేశాయి. రౌడీషీటర్లకు మద్దతు ఇచ్చిన వైఖరిపై నల్ల బెలూన్లు, కండువాలతో "గో బ్యాక్ జగన్" అంటూ ఘాటుగా స్పందించారు.