Home » Iran War
పశ్చిమాసియాలో ఇటీవల మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలకు తాత్కాలికంగా విరామం లభించనుంది. అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో పరస్పర దాడులను నిలిపివేయాలని ఒక ఒప్పందానికి వచ్చాయి.
పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదురుతున్న దశలో అమెరికా-ఇరాన్లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేసింది.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా మరోసారి వైమానిక దాడులకు దిగింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, పాలస్తీనా, గాజా సంక్షోభంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తప్పుబట్టారు. మోదీ వహిస్తున్న రాతి మౌనం దేశ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు.
ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినంత మాత్రాన ముప్పు పూర్తిగా తొలగిపోయినట్టు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్తో మళ్లీ ఘర్షణ మొదలైన నేపథ్యంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది. దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఒక కీలకమైన 'ప్రాథమిక ఒప్పందం' కుదిరింది.
శాంతి చర్చల మధ్య సైనిక దాడులు చేయడం అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో దాడులకు పాల్పడటం శాంతి ఒప్పంద స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని పేర్కొంది.
స్విట్జర్లాండ్లో జరిగిన ఇరాన్-యూఎస్ శాంతి చర్చల్లో పాల్గొనేందుకు వెళ్లిన పాకిస్థాన్ సైన్యాధిపతి, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను లక్ష్యంగా చేసుకుని, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' వ్యూహాత్మక దాడికి ప్రణాళిక రచించిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. చమురు ఉత్పత్తి, రవాణా సానుకూలంగా మారిన నేపథ్యంలో చమురు గిరాకీ తగ్గింది. దీంతో ధరలు పతనమవుతున్నాయి.