Home » International News
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ఆయతుల్లా సయ్యద్ మొజ్తాబా హుస్సేనీ ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.
ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత కొత్త నేతను ఎన్నుకునేందుకు అక్కడి ప్రభుత్వంలోని అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నారు.
గల్ఫ్ దేశాలపై దాడుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆదివారంనాడు తెలిపారు. పొరుగు దేశాలు దాడులు జరిపితే తమ దేశ రక్షణ కోసం ప్రతిస్పందించాల్సి వస్తుందని వివరించారు.
లెబనాన్ రాజదాని బీరుట్పై ఇజ్రాయెల్ ఆదివారంనాడు బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సర్ అల్ ఘార్బియా టౌన్లోని మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో సుమారు 19 మంది మృతిచెందారు.
ఇరాన్ తాజాగా బహ్రెయిన్ రాజధాని మేనామలోని జుఫైర్ జిల్లాలోని అమెరికా నావికాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధానకార్యాలయంపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 21 మంది అమెరికా సైనికులు మృతి చెందినట్టు టెహ్రాన్ టైమ్స్ తెలిపింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు కూడా ఇజ్రాయెల్ వాయుసేన జరిపిన తొలి దాడుల్లో గాయపడినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 26వ తేదీన ఇరాన్పై ఆపరేషన్ లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ వాయుసేన దాడులకు దిగిన సంగతి తెలిసిందే.
అమెరికా అమ్ములపొదిలో కీలకమైన థాడ్ రాడార్ వ్యవస్థను ఇరాన్ కుప్పకూల్చింది. దాని విలువ 30 కోట్ల డాలర్లు (రూ.2,758 కోట్లు). జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరం...
ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఇప్పటివరకూ వసూలు చేసిన సొమ్మును 45 రోజుల్లోగా వాపసు చేయడానికి అమెరికా సిద్ధమైంది. దీనికి...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఇతర నాయకుల హత్యకు కుట్రపన్నాడన్న కేసులో పాకిస్థాన్వాసి అసిఫ్ రజా మర్చంట్(48)కు బ్రూక్లిన్ కోర్టు శుక్రవారం జీవితాంతం జైలులో ఉండేలా...
ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో ఆ దేశం ప్రయోగిస్తున్న చౌక డ్రోన్లను ధ్వంసం చేయడం లేదా కూల్చి వేసేందుకు అమెరికా ప్రస్తుతం ఖరీదైన క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా...