Home » IMD
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబరు 16న నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యాయి.
బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17 నుంచి డిసెంబరు 7వ తేది వరకు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు.
వరుస అల్పపీడనాల ప్రభావంతో.. రాష్ట్రంలో ఈ నెల 16వ తేది నుంచి ‘ఈశాన్య’ రుతుపవనాలు తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలో అక్టోబరు నుంచి ఒకేసారి తీవ్రమైన ఎండ, తీవ్రమైన వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే.
వాతావరణంలో నెలకొన్న పరిస్థితులతో ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ తెలిపారు. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఈ నెల 8వ తేది వరకు ఒకటి, రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావారణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం దంచికొడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తమిళనాడు, పుదుచ్చేరిలో నవంబరు 3వ తేది వరకు మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుఫానుగా మారి కాకినాడ సమీపంలో తీరం దాటిందన్నారు.
మొంథా తుఫాను వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొంథా తుఫాన్ కారణంగా పలు రైళ్లని రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
మొంథా తుఫాను దృష్ట్యా వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.