Home » Hyderabad City Police
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సృష్టి ఫెర్టిలిటీ డాక్టర్ నమ్రత కస్టడీకి సంబంధించి పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.
రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాల్నాడు రెస్టారెంట్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది.
వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి ఆన్లైన్లో హార్స్ రేసింగ్పై బెట్టింగ్లను ఆహ్వానిస్తున్న ఓ బుకీతోపాటు ముగ్గురు పంటర్లను మల్కాజిగిరి ఎస్ఓటీ, జవహర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2లక్షల నగదు, మొబైల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
చోరీ జరగడం ఒకటైతే.. పోయిన సొత్తు విషయంలో క్లారిటీ లేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. చోరీ అయిన బంగారం 26 తులాలు అని బాధితులు పేర్కొంటుండగా, కాదు కాదు తాము తస్కరించింది కేవలం 5 తులాలే అంటూ నిందితులు పేర్కొంటుండడం ఇందుకు కారణమైంది.
ఒడిశాలో కిడ్నాప్కు గురై.. బాచుపల్లి ప్రాంతంలో బంధించి ఉన్న బాలికను మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చెర నుంచి విడిపించారు. ఒడిశా రాష్ట్రం కేంద్రపడ జిల్లా సాహిర గ్రామానికి చెందిన బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి బాచుపల్లి ప్రాంతంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న ఒక ఇంట్లో నిర్బంధించారు.
మహిళలు, పిల్లల రక్షణ కోసం సైబరాబాద్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని డీసీపీ సృజన కరణం పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఇంటా,బయట పిల్లలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేప్టీ వింగ్ ప్రత్యేకంగా పనిచేస్తోందన్నారు.
ఉప్పల్లోని ఓ ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు డ్రగ్ను రవాణా చేసి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్స్ను అరెస్ట్ చేశారు.
పలువురు అమాయకులను ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ల పేరుతో మోసం చేస్తున్న సైబర్ కేటుగాళ్లని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 సంవత్సరంలో 228 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు నిఘా వర్గాల అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో తాజాగా ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటివరకు అరెస్టైన నిందితుల సంఖ్య 11కు చేరింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు మహిళలే ఏజెంట్లుగా ఉన్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.