Home » Home Minister Anitha
డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే.. జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే పరిస్థితుల్లో లేమని అన్నారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన కొనసాగుతోంది. సత్యవరం గ్రామానికి చేరుకున్న హోం మంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.
విశాఖపట్నంలో హోంగార్డు ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. హోం మంత్రి ప్రోత్సాహంతో మొదటి విడతగా 975 మంది హోంగార్డులకు ఆరోగ్య బీమా అందించనున్నారు.
క్రైస్తవ మత ప్రచారకుడు, నటుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై హోం మంత్రి అనిత స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారంలో విచారణ జరుగుతోందని అన్నారు.
భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు.శ్రీకాళహస్తిలో సోమవారం టూటౌన్ పోలీస్స్టేషన్ భవనాన్ని మంత్రి సత్యప్రసాద్తో కలిసి ఆమె ప్రారంభించారు.
ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడం కోసమే జైళ్లు అని హోంమంత్రి అనిత అన్నారు. ఏపీలో సంచలనమైన కేసులను త్వరితగతిన విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయన్నారు.
అగ్నిమాపక శాఖ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సచివాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫైర్స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల పరిస్థితిపై అధికారులతో చర్చించారు.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, పోలీస్ స్టేషన్ను మంత్రులు ప్రారంభించారు.
అంకితభావం, కృషితో సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న శ్రామిక సోదర సోదరీమణులందరికీ హోం మంత్రి అనిత అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అని అన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత స్పందించారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోవడం అత్యంత బాధాకరమని ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.