Home » Gummadi Sandhya Rani
కురుపాం, అనంతపురం ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి, అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి.
అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
శాసన మండలికి వచ్చిన వారు కాఫీ, టీల కోసం దెబ్బలాడటం సిగ్గుచేటంటూ మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వైసీపీ కాఫీ, టీ కోసం చేసిన గొడవ వల్ల మండలిలో ప్రశ్నలే రాకుండా పోయాయని మంత్రి మండిపడ్డారు.
ఏపీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన పనులతోనే ఎన్నికల్లో ఓడించారని ఆక్షేపించారు. వైసీపీ హయాంలో సర్పంచులను పట్టించుకోలేదని, ఇబ్బందులకు గురిచేశారని మంత్రి సంధ్యారాణి ధ్వజమెత్తారు.
Maha Surya Vandanam: మహా సూర్య వందనం గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అసాధ్యమన్న పనిని గిరిజన విద్యార్థులు సుసాధ్యం చేస్తున్నారని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన ఆర్థిక శాఖ వద్ద పరిశీలనలో ఉందని, అనుమతి రాగానే
Gunman Bag Missing: ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్మెన్ బ్యాగ్ మిస్సవడం తీవ్ర కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణ నిమిత్తం సాలూరు వెళ్లిన ఆయన.. బ్యాగ్ మిస్ అయినట్లు గుర్తించి వెంటనే విజయనగరం చేరుకుని బ్యాగ్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
అడవుల్లో ఆదివాసీలకే ఆస్తి హక్కు ఉండాలన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఐదో షెడ్యూల్లో చేర్చి తెచ్చిన 1/70 చట్టానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. యాక్ట్ 1/70 మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని, గిరిజనులు ఆందోళన చెందవద్దని మంత్రి అన్నారు.
Minister Sandhya Rani: గిరిజన గ్రామాల్లో గిరిజన ప్రజల కోసం రోడ్లు నిర్మించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపనలు చేసిన అనతి కాలంలోనే ప్రారంభోత్సవాలు చేసి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెప్పారు.
చినుకులు పడితే చాటు మట్టి రోడ్లు బురదమయం, జోరుగా వాన పడితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నేటికీ గిరిజన గ్రామాల్లో కనిపిస్తున్నాయి. తాజాగా గిరిజన ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం ఆదివాసీ తండాలు ఎలా ఉన్నాయనేదానికి నిదర్శనంగా నిలుస్తోంది. అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి ..