Home » Google
గూగుల్ కంపెనీ తన ఉద్యోగులకు చక్కటి భోజన సదుపాయలను ఉచితంగా అందిస్తోందని టెక్ రంగంలో పనిచేస్తున్నవారికి చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా గూగుల్ ఫ్రీ మీల్స్ పాలసీ ప్రాచుర్యం పొందింది. మరి ఎందుకు ఇంతలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
సైబర్ స్కామర్లు ఇప్పుడు Gmailని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగించి వినియోగదారుల ఖాతాలను రికవరీ చేస్తామని మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ 'గూగుల్ ఫర్ ఇండియా' 10వ ఈవెంట్ ఈరోజు ఢిల్లీలో నిర్వహించింది. ఈ ఈవెంట్లో గూగుల్ జెమిని ఏఐ గురించి సహా కీలక ప్రకటనలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. గూగుల్ తన వార్షిక ‘గూగుల్ ఫర్ ఇండియా 2024’ ఈవెంట్ను అక్టోబర్ 3న నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ Android, AI, Google అసిస్టెంట్ సహా కీలక సేవల గురించి ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
మీకు కూడా జీమెయిల్ అకౌంట్ ఉందా. దానిని గత రెండేళ్లుగా ఉపయోగించడం లేదా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే సెప్టెంబర్ 20, 2024 నుంచి అలాంటి ఖాతాలను గూగుల్ తొలగించనుంది. ఈ క్రమంలో అలాంటి ఖాతాలను కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
డెస్క్టాప్ కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడేవారు జాగ్రత్తగా ఉండాలని భారత ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్)’ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
యూట్యూబ్(YouTube) మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ(56)(Susan Wojcicki) కన్నుమూశారు. ఈ క్రమంలో ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్ ఫేస్బుక్ భావోద్వేగ పోస్ట్ చేసి ఈ విచారకరమైన వార్తను షేర్ చేశారు. ఈ ఘటనపై గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్(Sundar Pichai) శనివారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X వేదికగా స్పందించారు.
యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ అనారోగ్యంతో కన్నుమూశారు. రెండేళ్ల నుంచి ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. యూట్యూబ్కు పాపులారిటీ తీసుకొచ్చేందుకు సుసాన్ కృషి చేశారు. సుసాన్ కన్నుమూశారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇంటర్నెట్ వాడే వారికి గూగుల్ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ అందించే ఏదో ఒక సర్వీస్ వాడుతూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో సేవలందిస్తున్న గూగుల్ సంస్థలో ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు పిల్లలకు(children) తప్పనిసరి పరికరాలుగా మారిపోయాయి. అనేక మంది పిల్లలు మాత్రం ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడి సోషల్ మీడియా ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నారు. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లల వ్యసనాన్ని దూరం చేయడానికి గూగుల్(google) ‘స్కూల్ టైమ్(school time feature)’ అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది.