Home » Flight Ticket Offers
మీరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్(Air India Express) ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు 70 కంటే ఎక్కువ అంతర్జాతీయ, దేశీయ విమానాల సర్వీసులను రద్దు చేసింది. విమానాల రద్దుకు కారణం పెద్ద సంఖ్యలో సిబ్బంది అనారోగ్య సెలవుపై వెళ్లడమేనని తెలుస్తోంది.
రేపు దేశవ్యాప్తంగా 2024 లోక్సభ ఎన్నికల(lok sabha election 2024) మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్(air india express) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రాబోయే 18వ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దేశంలోని యువతను సమీకరించడానికి #VoteAsYouAre ప్రచారాన్ని ప్రారంభించింది.
దేశంలోని విమానయాన రంగంలోకి మరో కొత్త ఫ్లైట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు ఇవి ఏకంగా అత్యంత తక్కువ ధరల్లో ఉండటం విశేషం. ఇటివల హైదరాబాద్ టూ గోవా ఫ్లైట్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధాని మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్(Lakshadweep)కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అనేక మంది పర్యాటక ప్రేమికులు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్కు అలయన్స్ ఎయిర్ విమాన సంస్థ ప్రయాణాలను ప్రారంభించిన ఏకైక విమానయాన సంస్థగా నిలించింది.
భారతదేశంలో అతిపెద్ద విమానయన సంస్థ అయిన ఇండిగో తమ ప్రయాణికులకు షాకిచ్చింది. తమ విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది. గతంలో రూ.150 నుంచి రూ.1500గా ఉన్న సీటు ఎంపిక ఛార్జీలను, ప్రస్తుతం రూ.150 నుంచి రూ.2,000 వరకు పెంచేసింది.
మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్లో నాలుగు రోజులపాటు నిర్భంధంలో ఉన్న భారతీయ ప్రయాణికులతో కూడిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానానికి విముక్తి లభించింది. సోమవారం మధ్యాహ్నం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన విమానం మంగళవారం తెల్లవారుజామున ముంబైలో ల్యాండ్ అయింది.
మానవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో ఫ్రెంచ్ అధికారుల అధీనంలో ఉన్న 303 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన విమానానికి లైన్ క్లియర్ అయింది. దీంతో మూడు రోజుల తర్వాత సోమవారం ఫ్రెంచ్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది.
మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నై తుఫాన్ ధాటికి అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. 8 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ వర్షాల ప్రభావం విమానాల ప్రయాణాలపై కూడా పడింది.
ఒమాన్, భారత్ మధ్య రాకపోకలు కొనసాగించేవారికి ఒమాన్ ఎయిర్ (Oman Air) గుడ్న్యూస్ చెప్పింది. భారత్లోని తిరువనంతపురం (Thiruvananthapuram) కు డైరెక్ట్ విమాన సర్వీస్ నడపనున్నట్లు ప్రకటించింది.
ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని భావించేవాళ్ల కోసం ఎయిరిండియా ప్రత్యేకంగా 96 గంటల సేల్ నిర్వహిస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణాల కోసం కేవలం ప్రారంభ ధరగా రూ.1,470 చెల్లించి ఈ ఆఫర్ పొందవచ్చు. ఈ ఆఫర్లో భాగంగా టిక్కెట్లపై కన్వీనియన్స్ ఫీజు కూడా ఉండదని ఎయిరిండియా వెల్లడించింది.